చిట్యాల మున్సిపల్ బరిలో 12 వార్డులకు బిజెపి అభ్యర్థులు
చిట్యాల మున్సిపల్ బరిలో 12 వార్డులకు బిజెపి అభ్యర్థులు
Komidala Mahender reddy
రాబోయే చిట్యాల మునిసిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పూర్తి స్థాయిలో పోటీకి దిగింది. మునిసిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు గాను 12 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసి బరిలోకి దించింది. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
బీజేపీ అభ్యర్థులుగా
1వ వార్డులో రుద్రవరం లింగస్వామి,
2వ వార్డులో గుండాల పవిత్ర నరేష్,
3వ వార్డులో పాల శ్రీలత రాకేష్,
4వ వార్డులో ఉద్రతీ నాగరాజు,
5వ వార్డులో ఈడుదుల నర్సమ్మ,
6వ వార్డులో గంజి గోవర్ధన్,
7వ వార్డులో పాల లక్షమామ్మ,
8వ వార్డులో కన్నె బోయన మహాలింగం,
9వ వార్డులో కూరెళ్ల శ్రీను,
10వ వార్డులో కునూరు సంజయ్ దాస్,
11వ వార్డులో ధుడ్డు భాగ్యమ్మ,
12వ వార్డులో సుంచు అశ్విని శ్రీను బరిలో నిలిచారు.
పార్టీ జిల్లా నాయకత్వం అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించగా, ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. ప్రతి వార్డులో స్థానిక సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలపై స్పష్టమైన హామీలతో ప్రజల ఆశీర్వాదం కోరుతున్నట్లు అభ్యర్థులు తెలిపారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల పోటీతో చిట్యాల రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి