Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:44 AM

చిట్యాల మండలంలో MGNREGA పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం

చిట్యాల మండలంలో MGNREGA పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం

చిట్యాల మండలంలో MGNREGA పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం
27-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని వెలిమినేడు, పెద్ద కాపర్తి, పిట్టంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులను తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ అధ్యక్షతన, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ టి. రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణతో పాటు సంతకాల కార్యక్రమం చేపట్టారు. MGNREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, గ్రామ పంచాయతీల అధికారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. VB-G RAM G చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు.రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా గ్రామాల్లో సంతకాల సేకరణ కొనసాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మండలంలో MGNREGA పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం

Article Image

చిట్యాల మండలంలోని వెలిమినేడు, పెద్ద కాపర్తి, పిట్టంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులను తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ అధ్యక్షతన, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ టి. రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణతో పాటు సంతకాల కార్యక్రమం చేపట్టారు. MGNREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, గ్రామ పంచాయతీల అధికారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. VB-G RAM G చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు.రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా గ్రామాల్లో సంతకాల సేకరణ కొనసాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News