చిట్యాల మండలంలో MGNREGA పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం
చిట్యాల మండలంలో MGNREGA పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం
Komidala Mahender reddy
చిట్యాల మండలంలోని వెలిమినేడు, పెద్ద కాపర్తి, పిట్టంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులను తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ అధ్యక్షతన, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ టి. రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణతో పాటు సంతకాల కార్యక్రమం చేపట్టారు. MGNREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, గ్రామ పంచాయతీల అధికారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. VB-G RAM G చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు.రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా గ్రామాల్లో సంతకాల సేకరణ కొనసాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి