చిట్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ వసూళ్ల రాజకీయాలకుపరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.
ప్రజాసేవకంటే స్వప్రయోజనాలకే వారు అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.ప్రజా సమస్యలను పక్కనపెట్టి అధికారాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే చిట్యాల ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కోల్పోయారని లింగయ్య అభిప్రాయపడ్డారు.
చిట్యాల అభివృద్ధికి నిజాయితీగల నాయకత్వం అవసరమని, ప్రజలు ఇకపై వసూల్ రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి