చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కందాటి చంద్రారెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 9వ వార్డు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగు అశోక్ ఆధ్వర్యంలో ఆయన బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేపూరి రవీందర్ కందాటి చంద్రారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం శేపూరి రవీందర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి