Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:45 PM

చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు

చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు

చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు
07-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. చిట్యాల మున్సిపాలిటీ 6వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జడల సంతోషి మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి

కాంగ్రెస్, బీజేపీ పార్టీల పాలన వల్ల ప్రజలు మోసపోయారని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన పాలకులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి, ప్రజల స్వరం వినిపించే నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.

అభ్యర్థి జడల సంతోషి మాట్లాడుతూ.. గెలుపు అనంతరం వార్డు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, మౌలిక వసతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీకి మద్దతుగా నినాదాలు చేశారు. వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పార్టీ నేతలు తెలిపారు.


Sthanikam

చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు

Article Image

నకిరేకల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. చిట్యాల మున్సిపాలిటీ 6వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జడల సంతోషి మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి

కాంగ్రెస్, బీజేపీ పార్టీల పాలన వల్ల ప్రజలు మోసపోయారని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన పాలకులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి, ప్రజల స్వరం వినిపించే నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.

అభ్యర్థి జడల సంతోషి మాట్లాడుతూ.. గెలుపు అనంతరం వార్డు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, మౌలిక వసతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీకి మద్దతుగా నినాదాలు చేశారు. వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పార్టీ నేతలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News