Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:40 AM

చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు

చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు

చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు
February 07, 2026 02:08 AM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. చిట్యాల మున్సిపాలిటీ 6వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జడల సంతోషి మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి

కాంగ్రెస్, బీజేపీ పార్టీల పాలన వల్ల ప్రజలు మోసపోయారని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన పాలకులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి, ప్రజల స్వరం వినిపించే నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.

అభ్యర్థి జడల సంతోషి మాట్లాడుతూ.. గెలుపు అనంతరం వార్డు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, మౌలిక వసతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీకి మద్దతుగా నినాదాలు చేశారు. వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పార్టీ నేతలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News