చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు
చిట్యాల ఆరవ వార్డులో బిఆర్ఎస్ జోరు
Komidala Mahender reddy
నకిరేకల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. చిట్యాల మున్సిపాలిటీ 6వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జడల సంతోషి మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి
కాంగ్రెస్, బీజేపీ పార్టీల పాలన వల్ల ప్రజలు మోసపోయారని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన పాలకులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి, ప్రజల స్వరం వినిపించే నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.
అభ్యర్థి జడల సంతోషి మాట్లాడుతూ.. గెలుపు అనంతరం వార్డు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, మౌలిక వసతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీకి మద్దతుగా నినాదాలు చేశారు. వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పార్టీ నేతలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి