Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:24 PM

చిన్నంపేట గ్రామంలో ఈ పంట నమోదుపై జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ కె. హబీబ్ బాషా ఆకస్మిక తనిఖీ

చిన్నంపేట గ్రామంలో ఈ పంట నమోదుపై జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ కె. హబీబ్ బాషా ఆకస్మిక తనిఖీ

చిన్నంపేట గ్రామంలో ఈ పంట నమోదుపై జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ కె. హబీబ్ బాషా ఆకస్మిక తనిఖీ
February 17, 2026 06:24 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం లోని చిన్నంపేట గ్రామంలో ఈ పంట నమోదుకు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ కె. హబీబ్ బాషా ఏలూరు వారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. చాట్రాయి మండలంలో 80% ఈ పంట నమోదు అయినదని ఈ నెల 20 వ తారీఖు కీ 100% పూర్తి చేయాలనీ ఆదేశించడమైనది. ప్రతి మొక్కాజొన్న, వరి పండించే రైతులు ఆర్ఎస్ కె ఇన్చార్జి లను సంప్రదించి ఈ పంట నమోదు చేసుకొని, ఏపీ ఎఫ్ ఆర్ ద్వారా విశిష్ట సంఖ్య కొరకు నమోదు చేసుకోవలెనని సూచించారు. డ్రోన్ ద్వారా స్ప్రై చేయించుకోదలచిన రైతులు"ఉబరైజెషన్" కిసాన్ డ్రోన్ అప్ ద్వారా రిజిస్టర్ అయ్యి తన పొలానికి డ్రోన్ సేవలు అందించుకోవాలని తెలియజేసినారు. రాబోవు కాలంలో రైతులకు ఏపీఎఫ్ఆర్ అనగా ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ విశిష్ట సంఖ్య రైతులకు ఎంతగానో ఉపయోగకరమని రైతులకు తెలియజేసినారు.తదుపరి రైతులకు మొక్కాజొన్న, వరి పంటలు పై తగు యాజమాన్య పద్ధతులును సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్, ఎంపీడీవో కృష్ణా రెడ్డి,చిన్నంపేట గ్రామ రైతులు, వ్యవసాయ సిబ్బంది ఎస్ కె ఫాతిమ, తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News