చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం
చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం
Komidala Mahender reddy
చిట్యాల మండలం చిన్నకపర్తి గ్రామంలో బుధవారం నాడు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశుగ్రాస రక్షణ మరియు పశువుల ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా, పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పశువులకు నేరుగా టీకాలు వేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ.. పశువులకు సోకే అత్యంత ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు టీకాలు ఏకైక మార్గమని పేర్కొన్నారు. ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించి, పశుసంపదను కాపాడుకోవాలని కోరారు. పశువుల ఆరోగ్యం విషయంలో రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ మల్లారెడ్డి, మాజీ వార్డు సభ్యులు ఎడ్ల శ్రీశైలం, పాల సెంటర్ చైర్మన్ దాసరి సైదులు, గొర్రెల కాపరి సంఘం అధ్యక్షులు మెట్టు నరసింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు వెంకటేష్, బొజ్జ బుచ్చయ్య మరియు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి