Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:27 PM

చిన్నకాపర్తి సౌమ్య విద్యామందిర్ లో ముందస్తు ఉగాది వేడుకలు

చిన్నకాపర్తి సౌమ్య విద్యామందిర్ లో ముందస్తు ఉగాది వేడుకలు

చిన్నకాపర్తి సౌమ్య విద్యామందిర్ లో ముందస్తు ఉగాది వేడుకలు
March 18, 2026 07:21 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని సౌమ్య విద్యామందిర్ పాఠశాలలో బుధవారం ముందస్తుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను ప్రిన్సిపల్ బొడిగె విజయకుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షడ్రుచుల సమ్మేళమైన ఉగాది పచ్చడిని, భక్షాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులందరూ ఉత్సాహంగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకొని పచ్చడిని సేవించి, భక్షాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బొడిగె విజయకుమార్ మాట్లాడుతూ జీవితంలో కష్టసుఖాలు, లాభనష్టాలు సర్వసాధారణమని, అన్నింటినీ సమంగా స్వీకరిస్తూ ప్రతిరోజును ఆనందంగా గడపాలని, ఉగాది స్పూర్తి, కొత్త లక్ష్యాలతో ముందడుగు వేయాలన్నారు. విద్యార్థులకు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ప్రాశస్త్యం, పంచాంగం, ఉగాది పచ్చడి విశిష్టత, సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించారు. ఈ నూతన సంవత్సరంలో విద్యార్థులు అన్నిరంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పండుగలు మన వారసత్వ సంపదగా భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పాఠశాలలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వసంత ఋతువులో ఉగాది పర్వదినం రోజున చెట్లు పచ్చగా చిగురిస్తూ ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని, అదే ఉత్సాహం విద్యార్థుల జీవితాల్లో నిండి ఉన్నత చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బొడిగె రాణి, రుద్రారపు లావణ్య, మునుకుంట్ల వేణు, ఈరమల్ల లూసిక, మునుకుంట్ల స్వాతి, బెల్లంకొండ రాజేశ్వరి, సూరోజు హర్షిణి, విద్యార్థులు బోగ ఆనంది, మెట్టు వర్షిత, ఆకుల సుప్రీత్, కొత్త ప్రణీత్, మెట్టు శివతేజ, కార్తీక్, దివ్యశ్రీ, కావ్య, ప్రణవి, రిచిత, శ్రీకృష్ణప్రియ, పవిత్ర, జ్యోతి, ఇందు, రిషా, వర్షిత, సహస్ర, శృతి, హన్సిక, ప్రతీక్, అలీన తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News