Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:49 AM

చిన్న శ్రీశైలంలో బ్రహ్మోత్సవ సందడి. ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్

చిన్న శ్రీశైలంలో బ్రహ్మోత్సవ సందడి. ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్

చిన్న శ్రీశైలంలో బ్రహ్మోత్సవ సందడి.  ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్
09-02-2026 323 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం)లో బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ శివరాత్రి నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుట్టపై జెసిపిలతో పనులు చేపట్టి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కడారి అంగడయ్య, ఆగు లింగస్వామి, వార్డు మెంబర్ వర్కాల వినయ్, గ్రామ పెద్దలు మందడి సంతోష్ రెడ్డి, చల్ల మల్లేశం, గణేష్, బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

Sthanikam

చిన్న శ్రీశైలంలో బ్రహ్మోత్సవ సందడి. ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్

Article Image

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం)లో బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ శివరాత్రి నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుట్టపై జెసిపిలతో పనులు చేపట్టి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కడారి అంగడయ్య, ఆగు లింగస్వామి, వార్డు మెంబర్ వర్కాల వినయ్, గ్రామ పెద్దలు మందడి సంతోష్ రెడ్డి, చల్ల మల్లేశం, గణేష్, బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News