చిన్న శ్రీశైలంలో బ్రహ్మోత్సవ సందడి. ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్
చిన్న శ్రీశైలంలో బ్రహ్మోత్సవ సందడి. ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్
స్థానికం బృందం
రామన్నపేట, నిదానపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం)లో బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ యాదవ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ శివరాత్రి నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుట్టపై జెసిపిలతో పనులు చేపట్టి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కడారి అంగడయ్య, ఆగు లింగస్వామి, వార్డు మెంబర్ వర్కాల వినయ్, గ్రామ పెద్దలు మందడి సంతోష్ రెడ్డి, చల్ల మల్లేశం, గణేష్, బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి