చినకొండూరులో అక్రమ మద్యం స్వాధీనం
చినకొండూరులో అక్రమ మద్యం స్వాధీనం
K.RAVI
చౌటుప్పల్ మండలంలోని చినకొండూరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం పట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం… చౌటుప్పల్ పోలీస్ స్టేషన్కు చెందిన హెచ్సీ ఎ. నరేష్, ఎఆర్పీసీ సీతారామరెడ్డి, పట్రోల్ మొబైల్-I డ్యూటీలో ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు 10:15 గంటలకు చినకొండూరు గ్రామంలో అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారంఅందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఒక కిరాణా దుకాణాన్ని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కింగ్ఫిషర్ బీర్ (650 మి.లీ) 22 సీసాలు, రాయల్ స్టాగ్ (750 మి.లీ) 1 సీసా, సిగ్నేచర్ (180 మి.లీ) 3 సీసాలు, రాయల్ స్టాగ్ (180 మి.లీ) 2 సీసాలు ఉన్నాయి. అక్కడ ఉన్న వ్యక్తిని ప్రశ్నించగా తన పేరు వూర కర్ణాకర్ (44), తండ్రి అంజనేయులు, వృత్తి వ్యాపారం, నివాసం చినకొండూరు గ్రామమని తెలిపాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి సి ఐ మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి