ఛలో ఢిల్లీ ధర్నాను విజయవంతం చేయాలి
ఛలో ఢిల్లీ ధర్నాను విజయవంతం చేయాలి
Biksham
పీఆర్టీయూ గోడ పత్రిక ఆవిష్కరణ
ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో నిర్వహించనున్న సామూహిక ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ పిలుపునిచ్చారు. పీఆర్టీయూ సూర్యాపేట జిల్లా కార్యాలయం ఎదుట గోడ పత్రికను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు. దేశం నలుమూలల నుంచి వేలాదిగా ఉపాధ్యాయులు తరలివచ్చి ఈ ధర్నాలో పాల్గొననున్నారని తెలిపారు.
టెట్ రద్దుతో పాటు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ బొల్లికొండ కోటయ్య, మాజీ గౌరవ అధ్యక్షులు కందుకూరి శివశంకర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దండుగుల యల్లయ్య, మేకల రాజశేఖర్, గంజి శంకర్, మండల శాఖల అధ్యక్షులు ఊట్కూరు వెంకటరెడ్డి, ఉల్లెందుల సైదులు, తంగెళ్ల వాసుదేవరెడ్డి, కాసం చక్రధర్, మండల ప్రధాన కార్యదర్శులు నంద్యాల చౌదరి రెడ్డి, పొదిల రవీందర్, జలగం పురుషోత్తం, మడిపల్లి కిరణ్, చిత్తలూరు శ్రీరాములు, జిల్లా ఉపాధ్యక్షులు చోడవరపు నాగరాజు, చిట్యాల సతీష్, గుణగంటి సురేందర్, సీనియర్ బాధ్యులు సాదే లక్ష్మీనారాయణ, బానోత్ బాలాజీ, కంచర్ల మాధవరెడ్డి, గుండగాని రమేష్, రణబోతు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి