PRINT TIME: July 11, 2026 02:46 AM
చేయి గుర్తుకే ఓటు వేయాలి
చేయి గుర్తుకే ఓటు వేయాలి
February 07, 2026 04:32 PM
117 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
ఎలుగూరి అలివేలు చంటిబాబు గెలుపే లక్ష్యం
మాజీ కౌన్సిలర్ తండు శ్రీనివాస్ గౌడ్ పిలుపు
సూర్యాపేట మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలుగూరి అలివేలు చంటిబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ కౌన్సిలర్ తండు శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం 22వ వార్డు పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయన, స్థానిక ప్రముఖులను కలిసి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే అభ్యర్థిగా ఎలుగూరి అలివేలు చంటిబాబు నిలుస్తారని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని తెలిపారు.వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి విజయం తప్పనిసరిగా మారాలని, ప్రజలంతా ఏకతాటిపై నిలబడి చేయి గుర్తుకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి