PRINT TIME: May 26, 2026 06:49 PM
చేసినసేవలకు గుర్తింపు తప్పదు – హైకోర్టులో హెడ్ కానిస్టేబుల్ రమేష్కు సన్మానం
చేసినసేవలకు గుర్తింపు తప్పదు – హైకోర్టులో హెడ్ కానిస్టేబుల్ రమేష్కు సన్మానం
January 10, 2026 02:17 PM
57 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
చేసిన సేవలకు గుర్తింపు తప్పదని మరోసారి రుజువైంది. సూర్యాపేట జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్, హైకోర్టు లైజన్ ఆఫీసర్ పాలెల్లి రమేష్ ఇటీవల ప్రతిభావంతమైన సేవలకు గాను సేవ పతాకం పొందిన నేపథ్యంలో, హైకోర్టు న్యాయస్థానంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జితేందర్ రావు, అరుణ్ కుమార్, జిపి మహేష్ రాజుతో పాటు న్యాయస్థాన సిబ్బంది రమేష్ను ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, అధికారులు మాట్లాడుతూ హైకోర్టు లైజన్ ఆఫీసర్గా రమేష్ నిర్వర్తిస్తున్న విధులు ఆదర్శవంతమని ప్రశంసించారు. న్యాయస్థాన వ్యవహారాల్లో పోలీస్ శాఖతో సమన్వయం సాధిస్తూ, కేసుల సకాల పరిష్కారానికి ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి