చెరువుగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు మాస్టర్ ప్లాన్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చెరువుగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు మాస్టర్ ప్లాన్ ఎమ్మెల్యే వేముల వీరేశం
Komidala Mahender reddy
నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
* చెరువుగట్టు బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
జనవరి 23 నుండి 30 వరకు జరిగే ఉత్సవాల ఏర్పాటుకు ప్రభుత్వ అన్ని శాఖలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు స్వామి వారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ చెరువుగట్టు బ్రహోత్సవముల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అని శాఖల అధికారులు సమన్వయంతో పని పనిచేసే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఆలయ అభివృద్ధికి 100 కోట్ల అంచనాలతో మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశామని వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు , ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి