చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం
చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం
Komidala Mahender reddy
గడువు దాటిన పానీయాలు, నకిలీ నీటిబాటిళ్లు.. భక్తుల ఆరోగ్యంపై ఆటలు
చెరువుగట్టు: పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల విశ్వాసాన్ని డబ్బుగా మార్చుకుంటూ, వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ఓ కూల్ డ్రింక్ దుకాణంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆలయ ఈవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆహార భద్రత విభాగం అధికారులు గురువారం సడెన్ తనిఖీలు నిర్వహించి షాప్ను సీజ్ చేశారు.
తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. దుకాణంలో గడువు ముగిసిన పానీయాలు భారీగా నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ వాటర్ బాటిళ్లు విక్రయిస్తూ భక్తులను మోసం చేస్తున్నట్టు తేలింది. ఆలయానికి వచ్చే భక్తులు అధికంగా ఈ దుకాణంపైనే ఆధారపడటాన్ని ఆసరాగా చేసుకుని, నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడేలా వ్యవహరించిన దుకాణదారుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్కు పంపించి పూర్తి నివేదిక రాగానే మరింత చర్యలు ఉంటాయని ఆహార భద్రత అధికారులు స్పష్టం చేశారు.ఈ ఘటనతో చెరువుగట్టుకు వచ్చే భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ పరిసరాల్లో విక్రయించే ఆహార పదార్థాలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి