Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేటకు మళ్లీ పూర్వ వైభవం… నియోజకవర్గం ఏర్పాటు చేయాలి – పోతరాజు శంకరయ్య “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 12:12 AM

చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం

చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం

చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం
April 08, 2026 10:18 PM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గడువు దాటిన పానీయాలు, నకిలీ నీటిబాటిళ్లు.. భక్తుల ఆరోగ్యంపై ఆటలు

చెరువుగట్టు: పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల విశ్వాసాన్ని డబ్బుగా మార్చుకుంటూ, వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ఓ కూల్ డ్రింక్ దుకాణంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆలయ ఈవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆహార భద్రత విభాగం అధికారులు గురువారం సడెన్ తనిఖీలు నిర్వహించి షాప్‌ను సీజ్ చేశారు.

తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. దుకాణంలో గడువు ముగిసిన పానీయాలు భారీగా నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ వాటర్ బాటిళ్లు విక్రయిస్తూ భక్తులను మోసం చేస్తున్నట్టు తేలింది. ఆలయానికి వచ్చే భక్తులు అధికంగా ఈ దుకాణంపైనే ఆధారపడటాన్ని ఆసరాగా చేసుకుని, నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడేలా వ్యవహరించిన దుకాణదారుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్‌కు పంపించి పూర్తి నివేదిక రాగానే మరింత చర్యలు ఉంటాయని ఆహార భద్రత అధికారులు స్పష్టం చేశారు.ఈ ఘటనతో చెరువుగట్టుకు వచ్చే భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ పరిసరాల్లో విక్రయించే ఆహార పదార్థాలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News