Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:46 AM

చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం

చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం

చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం
April 08, 2026 10:18 PM 220 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గడువు దాటిన పానీయాలు, నకిలీ నీటిబాటిళ్లు.. భక్తుల ఆరోగ్యంపై ఆటలు

చెరువుగట్టు: పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల విశ్వాసాన్ని డబ్బుగా మార్చుకుంటూ, వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ఓ కూల్ డ్రింక్ దుకాణంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆలయ ఈవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆహార భద్రత విభాగం అధికారులు గురువారం సడెన్ తనిఖీలు నిర్వహించి షాప్‌ను సీజ్ చేశారు.

తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. దుకాణంలో గడువు ముగిసిన పానీయాలు భారీగా నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ వాటర్ బాటిళ్లు విక్రయిస్తూ భక్తులను మోసం చేస్తున్నట్టు తేలింది. ఆలయానికి వచ్చే భక్తులు అధికంగా ఈ దుకాణంపైనే ఆధారపడటాన్ని ఆసరాగా చేసుకుని, నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడేలా వ్యవహరించిన దుకాణదారుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్‌కు పంపించి పూర్తి నివేదిక రాగానే మరింత చర్యలు ఉంటాయని ఆహార భద్రత అధికారులు స్పష్టం చేశారు.ఈ ఘటనతో చెరువుగట్టుకు వచ్చే భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ పరిసరాల్లో విక్రయించే ఆహార పదార్థాలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News