స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో వెలసిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం అగ్నిగుండాల మీదుగా నడిచి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, ప్రజలందరికీ స్వామివారి కృపతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి