Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 11:00 AM

చెరువు కబ్జా....గగ్గోలు పెడుతున్న పేదలు

చెరువు కబ్జా....గగ్గోలు పెడుతున్న పేదలు

చెరువు కబ్జా....గగ్గోలు పెడుతున్న పేదలు
January 25, 2026 07:03 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:

ముసునూరు:గ్రామ అవసరాల కోసం తరాల నాడు తవ్వించి ఇచ్చిన పేదల చెరువు ఆక్రమణకు గురైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని చింతలవల్లి గ్రామంలో 200 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన దాత నాగళ్ళ రామయ్య గ్రామ అవసరాల కోసం తన సొంత నిధులతో చెరువు తవ్వించి దానంగా ఇచ్చాడు. నాటి నుంచి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు మంచినీటి అవసరాలకుచెరువునువాడుకుంటున్నారు. కాల క్రమేణా గ్రామంలో మంచినీటికి బావులు, గొట్టపు బావులు, చేతి పంపులు, బోర్లు, మోటార్లు అందుబాటులోకి రావడంతో, చెరువును పశువుల దాహార్తిని తీర్చేందుకు వాడు తున్నారు.కాగా ఏడాదిన్నర క్రితం నుంచి దాతకు ఏ మాత్రం సంబంధం లేని అధికార పార్టీకి చెందిన కొందరు పని గట్టుకొని చెరువును ఆక్రమించే పనిలో పడ్డారు. తమకు పట్టాలు ఉన్నాయని, ఆన్ లైన్ లో నమోదైనాయని చెబుతూ కబ్జాకు దిగారు.దీనిపై గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు కలిసి జిల్లా కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్, ముసునూరు తహసీల్దార్ కు అర్జీలు అందించి పరిష్కారం కోరారు.ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కబ్జా దారులు మూడు జేసీబీలు, నాలుగు బుల్డోజర్లతో కట్టను తవ్వించారు.ఆ మట్టి, గ్రావెల్ తో చెరువును పూడ్చడం ఆరంభించడంతో గ్రామస్తులంతా కలిసి అడ్డుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి పేదల చెరువును గ్రామ అవసరాల కోసం యథాతథంగా ఉంచాలని పేదలు కోరుతున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News