చెరువు కబ్జా....గగ్గోలు పెడుతున్న పేదలు
చెరువు కబ్జా....గగ్గోలు పెడుతున్న పేదలు
A Arunkumar
స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:
ముసునూరు:గ్రామ అవసరాల కోసం తరాల నాడు తవ్వించి ఇచ్చిన పేదల చెరువు ఆక్రమణకు గురైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని చింతలవల్లి గ్రామంలో 200 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన దాత నాగళ్ళ రామయ్య గ్రామ అవసరాల కోసం తన సొంత నిధులతో చెరువు తవ్వించి దానంగా ఇచ్చాడు. నాటి నుంచి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు మంచినీటి అవసరాలకుచెరువునువాడుకుంటున్నారు. కాల క్రమేణా గ్రామంలో మంచినీటికి బావులు, గొట్టపు బావులు, చేతి పంపులు, బోర్లు, మోటార్లు అందుబాటులోకి రావడంతో, చెరువును పశువుల దాహార్తిని తీర్చేందుకు వాడు తున్నారు.కాగా ఏడాదిన్నర క్రితం నుంచి దాతకు ఏ మాత్రం సంబంధం లేని అధికార పార్టీకి చెందిన కొందరు పని గట్టుకొని చెరువును ఆక్రమించే పనిలో పడ్డారు. తమకు పట్టాలు ఉన్నాయని, ఆన్ లైన్ లో నమోదైనాయని చెబుతూ కబ్జాకు దిగారు.దీనిపై గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు కలిసి జిల్లా కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్, ముసునూరు తహసీల్దార్ కు అర్జీలు అందించి పరిష్కారం కోరారు.ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కబ్జా దారులు మూడు జేసీబీలు, నాలుగు బుల్డోజర్లతో కట్టను తవ్వించారు.ఆ మట్టి, గ్రావెల్ తో చెరువును పూడ్చడం ఆరంభించడంతో గ్రామస్తులంతా కలిసి అడ్డుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి పేదల చెరువును గ్రామ అవసరాల కోసం యథాతథంగా ఉంచాలని పేదలు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి