Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 11:23 AM

చెరుకూరు గ్రామంలో ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ తీవ్ర గాయాలతో రైతు అపస్మారక స్థితి

చెరుకూరు గ్రామంలో ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ తీవ్ర గాయాలతో రైతు అపస్మారక స్థితి

చెరుకూరు గ్రామంలో ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ తీవ్ర గాయాలతో రైతు అపస్మారక స్థితి
May 15, 2026 08:35 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. చెరుకూరు గ్రామానికి చెందిన రైతు పుట్టప్ప పొలం పనులకు ఎద్దుల బండిపై వెళ్తుండగా, మడకశిర వెళ్లే మార్గంలో పెనుకొండ వైపు నుంచి వచ్చిన లారీ ముందుగా వెళ్తున్న ఎద్దుల బండిని ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో రైతు పుట్టప్పకు తీవ్ర గాయాలు కాగా ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో రెండు ఎద్దులు గాయపడగా, ఎద్దుల బండి పూర్తిగా దెబ్బతింది.


ఎద్దులు మరియు బండికి కలిపి సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News