Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:13 AM

చెరుకూరు గ్రామంలో ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ తీవ్ర గాయాలతో రైతు అపస్మారక స్థితి

చెరుకూరు గ్రామంలో ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ తీవ్ర గాయాలతో రైతు అపస్మారక స్థితి

చెరుకూరు గ్రామంలో ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ తీవ్ర గాయాలతో రైతు అపస్మారక స్థితి
15-05-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. చెరుకూరు గ్రామానికి చెందిన రైతు పుట్టప్ప పొలం పనులకు ఎద్దుల బండిపై వెళ్తుండగా, మడకశిర వెళ్లే మార్గంలో పెనుకొండ వైపు నుంచి వచ్చిన లారీ ముందుగా వెళ్తున్న ఎద్దుల బండిని ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో రైతు పుట్టప్పకు తీవ్ర గాయాలు కాగా ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో రెండు ఎద్దులు గాయపడగా, ఎద్దుల బండి పూర్తిగా దెబ్బతింది.


ఎద్దులు మరియు బండికి కలిపి సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Sthanikam

చెరుకూరు గ్రామంలో ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ తీవ్ర గాయాలతో రైతు అపస్మారక స్థితి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. చెరుకూరు గ్రామానికి చెందిన రైతు పుట్టప్ప పొలం పనులకు ఎద్దుల బండిపై వెళ్తుండగా, మడకశిర వెళ్లే మార్గంలో పెనుకొండ వైపు నుంచి వచ్చిన లారీ ముందుగా వెళ్తున్న ఎద్దుల బండిని ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో రైతు పుట్టప్పకు తీవ్ర గాయాలు కాగా ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో రెండు ఎద్దులు గాయపడగా, ఎద్దుల బండి పూర్తిగా దెబ్బతింది.


ఎద్దులు మరియు బండికి కలిపి సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News