శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. చెరుకూరు గ్రామానికి చెందిన రైతు పుట్టప్ప పొలం పనులకు ఎద్దుల బండిపై వెళ్తుండగా, మడకశిర వెళ్లే మార్గంలో పెనుకొండ వైపు నుంచి వచ్చిన లారీ ముందుగా వెళ్తున్న ఎద్దుల బండిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రైతు పుట్టప్పకు తీవ్ర గాయాలు కాగా ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో రెండు ఎద్దులు గాయపడగా, ఎద్దుల బండి పూర్తిగా దెబ్బతింది.
ఎద్దులు మరియు బండికి కలిపి సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి