Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

చెరుకు స్వాతి శివ గౌడ్ గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు

చెరుకు స్వాతి శివ గౌడ్ గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు

చెరుకు స్వాతి శివ గౌడ్ గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు
February 06, 2026 01:25 PM 395 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

బిజెపి పార్టీ 13వ వార్డు కౌన్సిలర్

అభ్యర్థి చెరుకు స్వాతి శివ గౌడ్ గెలుపు.. వార్డు అభివృద్ధికి కీలక మలుపుగా మారుతుందని మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం 13వ వార్డులో బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి స్వాతి గురువారం ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా రామ్ నగర్ లో ప్రారంభమైన ర్యాలీ, కృష్ణానగర్ మీదుగా సర్వీస్ రోడ్డు వెంట పద్మశాలి కాలనీ వరకు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. అభ్యర్థితో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, యువత నుంచి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ చదువుకున్న యువతకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే చెరుకు స్వాతి శివ గౌడ్ కు అవకాశం ఇచ్చామన్నారు. వార్డు ప్రజలు ఆదరించిఆశీర్వదించాలని కోరారు. 13వ వార్డు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, వార్డు అభివృద్ధి మీ చేతుల్లోనే ఉందన్నారు. బిజెపి అభ్యర్థి చెరుకు స్వాతి శివ గౌడ్ ను గెలిపించుకుంటే వార్డు స్వరూపం మారుతుందన్నారు. వార్డు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి చెరుకు స్వాతి శివ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, బీజేవైఎం నాయకులు దిండు భాస్కర్, పబ్బు వంశీ, నాయకులు మార్గం స్వామి యాదవ్, ఉష్కాగుల శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News