Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:56 PM

చెరుకు స్వాతి శివ గౌడ్ గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు

చెరుకు స్వాతి శివ గౌడ్ గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు

చెరుకు స్వాతి శివ గౌడ్ గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు
February 06, 2026 01:25 PM 391 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

బిజెపి పార్టీ 13వ వార్డు కౌన్సిలర్

అభ్యర్థి చెరుకు స్వాతి శివ గౌడ్ గెలుపు.. వార్డు అభివృద్ధికి కీలక మలుపుగా మారుతుందని మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం 13వ వార్డులో బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి స్వాతి గురువారం ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా రామ్ నగర్ లో ప్రారంభమైన ర్యాలీ, కృష్ణానగర్ మీదుగా సర్వీస్ రోడ్డు వెంట పద్మశాలి కాలనీ వరకు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. అభ్యర్థితో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, యువత నుంచి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ చదువుకున్న యువతకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే చెరుకు స్వాతి శివ గౌడ్ కు అవకాశం ఇచ్చామన్నారు. వార్డు ప్రజలు ఆదరించిఆశీర్వదించాలని కోరారు. 13వ వార్డు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, వార్డు అభివృద్ధి మీ చేతుల్లోనే ఉందన్నారు. బిజెపి అభ్యర్థి చెరుకు స్వాతి శివ గౌడ్ ను గెలిపించుకుంటే వార్డు స్వరూపం మారుతుందన్నారు. వార్డు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి చెరుకు స్వాతి శివ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, బీజేవైఎం నాయకులు దిండు భాస్కర్, పబ్బు వంశీ, నాయకులు మార్గం స్వామి యాదవ్, ఉష్కాగుల శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News