చీమలపాడు లో మామిడి రైతుల ధర్నా.. నష్టపరిహారం కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం
చీమలపాడు లో మామిడి రైతుల ధర్నా.. నష్టపరిహారం కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం
GADDAM JAGANMOHAN REDDY
ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలో జాతీయ రహదారిపై మామిడి రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతినడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నల్ల తెగులు, పిన్నెల్లి నల్లమంగు, మొండిపుచ్చు వంటి వ్యాధుల కారణంగా మామిడి తోటలు పూర్తిగా నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ దిగుబడి లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి మామిడి రైతులకు ఎకరాకు ఒక లక్ష రూపాయల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. రైతుల ధర్నాతో కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి