Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:42 AM

చీమలపాడు లో మామిడి రైతుల ధర్నా.. నష్టపరిహారం కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం

చీమలపాడు లో మామిడి రైతుల ధర్నా.. నష్టపరిహారం కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం

చీమలపాడు లో మామిడి రైతుల ధర్నా.. నష్టపరిహారం కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం
14-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలో జాతీయ రహదారిపై మామిడి రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతినడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నల్ల తెగులు, పిన్నెల్లి నల్లమంగు, మొండిపుచ్చు వంటి వ్యాధుల కారణంగా మామిడి తోటలు పూర్తిగా నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ దిగుబడి లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి మామిడి రైతులకు ఎకరాకు ఒక లక్ష రూపాయల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. రైతుల ధర్నాతో కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Sthanikam

చీమలపాడు లో మామిడి రైతుల ధర్నా.. నష్టపరిహారం కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం

Article Image

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలో జాతీయ రహదారిపై మామిడి రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతినడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నల్ల తెగులు, పిన్నెల్లి నల్లమంగు, మొండిపుచ్చు వంటి వ్యాధుల కారణంగా మామిడి తోటలు పూర్తిగా నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ దిగుబడి లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి మామిడి రైతులకు ఎకరాకు ఒక లక్ష రూపాయల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. రైతుల ధర్నాతో కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News