Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

చీమలపాడు లో మామిడి రైతుల ధర్నా.. నష్టపరిహారం కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం

చీమలపాడు లో మామిడి రైతుల ధర్నా.. నష్టపరిహారం కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం

చీమలపాడు లో మామిడి రైతుల ధర్నా.. నష్టపరిహారం కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం
March 14, 2026 07:19 AM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలో జాతీయ రహదారిపై మామిడి రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతినడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నల్ల తెగులు, పిన్నెల్లి నల్లమంగు, మొండిపుచ్చు వంటి వ్యాధుల కారణంగా మామిడి తోటలు పూర్తిగా నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ దిగుబడి లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి మామిడి రైతులకు ఎకరాకు ఒక లక్ష రూపాయల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. రైతుల ధర్నాతో కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News