చౌటుప్పల్లో వార్డు సభలు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”పై అవగాహన
చౌటుప్పల్లో వార్డు సభలు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”పై అవగాహన
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో గురువారం ఉదయం 10 గంటలకు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కింద వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ వార్డు సభల్లో ప్రజలకు సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలతో పాటు త్వరలో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాల గురించి వివరించబడుతుంది.
అదేవిధంగా ప్రతి వార్డులోని స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశాలు సంబంధిత వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన నిర్వహించబడతాయి. చౌటుప్పల్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు వార్డుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి