Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గంజాయితో ఐదుగురు అరెస్ట్ భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 09:34 PM

చౌటుప్పల్‌లో వార్డు సభలు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”పై అవగాహన

చౌటుప్పల్‌లో వార్డు సభలు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”పై అవగాహన

చౌటుప్పల్‌లో వార్డు సభలు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”పై అవగాహన
April 01, 2026 07:34 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో గురువారం ఉదయం 10 గంటలకు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కింద వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ వార్డు సభల్లో ప్రజలకు సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలతో పాటు త్వరలో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాల గురించి వివరించబడుతుంది.

అదేవిధంగా ప్రతి వార్డులోని స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశాలు సంబంధిత వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన నిర్వహించబడతాయి. చౌటుప్పల్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు వార్డుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News