Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:12 AM

చౌటుప్పల్‌లో వార్డు సభలు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”పై అవగాహన

చౌటుప్పల్‌లో వార్డు సభలు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”పై అవగాహన

చౌటుప్పల్‌లో వార్డు సభలు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”పై అవగాహన
01-04-2026 188 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో గురువారం ఉదయం 10 గంటలకు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కింద వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ వార్డు సభల్లో ప్రజలకు సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలతో పాటు త్వరలో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాల గురించి వివరించబడుతుంది.

అదేవిధంగా ప్రతి వార్డులోని స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశాలు సంబంధిత వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన నిర్వహించబడతాయి. చౌటుప్పల్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు వార్డుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి కోరారు.

Sthanikam

చౌటుప్పల్‌లో వార్డు సభలు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”పై అవగాహన

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో గురువారం ఉదయం 10 గంటలకు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కింద వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ వార్డు సభల్లో ప్రజలకు సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలతో పాటు త్వరలో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాల గురించి వివరించబడుతుంది.

అదేవిధంగా ప్రతి వార్డులోని స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశాలు సంబంధిత వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన నిర్వహించబడతాయి. చౌటుప్పల్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు వార్డుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News