Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

చౌటుప్పల్‌లో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చౌటుప్పల్‌లో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చౌటుప్పల్‌లో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
March 29, 2026 04:02 PM 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్టీఆర్‌కు నివాళులు.. కేక్ కట్ చేసి సంబరాలు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చౌటుప్పల్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకావిష్కరణ చేసి, వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గం మాజీ కోఆర్డినేటర్, మండల టిడిపి అధ్యక్షుడు బడుగు లక్ష్మయ్య మాట్లాడుతూ, 1983 మార్చి 29న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందిందన్నారు. కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు.బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీగా టిడిపి నిలిచిందన్నారు. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైనా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిందని, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ మరింత బలపడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర రాజకీయాల్లో కూడా టిడిపి కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, మారగోని అశోక్ గౌడ్, మున్సిపల్ కమిటీ అధ్యక్షుడు సుంకరి జంగయ్య గౌడ్, ప్రచార కార్యదర్శి పాశం రఘుపతి, టీఎన్టీసీ అధ్యక్షుడు బొంగు బాదుషా, మున్సిపల్ ఉపాధ్యక్షుడు తలుపునురి శీను గౌడ్, గోశిక పాండు, చెరుకు అశోక్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల శంకరయ్య, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, నూనె వెంకటేశం, కందగట్ల హరికృష్ణ, సంజీవ, సీతయ్య, సిగుళ్ల ఐలయ్య, గుర్రం యాదగిరి, నరసింహ, అంతటి కిష్టయ్య, బుడుగు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News