Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూ.10 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 10:38 AM

చౌటుప్పల్‌లో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష

చౌటుప్పల్‌లో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష

చౌటుప్పల్‌లో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష
May 16, 2026 07:50 AM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్,: మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా తాగునీటి సరఫరా అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్‌లైన్ మరమ్మతులు, నీటి నిల్వలు, పంపింగ్ వ్యవస్థపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వార్డుల్లో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని, అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీవో శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News