చౌటుప్పల్,: మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా తాగునీటి సరఫరా అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్ మరమ్మతులు, నీటి నిల్వలు, పంపింగ్ వ్యవస్థపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వార్డుల్లో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని, అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్డీవో శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి