Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:08 AM

చౌటుప్పల్‌లో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష

చౌటుప్పల్‌లో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష

చౌటుప్పల్‌లో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష
16-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్,: మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా తాగునీటి సరఫరా అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్‌లైన్ మరమ్మతులు, నీటి నిల్వలు, పంపింగ్ వ్యవస్థపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వార్డుల్లో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని, అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీవో శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష

Article Image

చౌటుప్పల్,: మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా తాగునీటి సరఫరా అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్‌లైన్ మరమ్మతులు, నీటి నిల్వలు, పంపింగ్ వ్యవస్థపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వార్డుల్లో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని, అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీవో శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News