చౌటుప్పల్లో పేకాట స్థావరంపై దాడి: నలుగురు అరెస్ట్
చౌటుప్పల్లో పేకాట స్థావరంపై దాడి: నలుగురు అరెస్ట్
K.RAVI
చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో గల హెచ్ఎండీఏ (HMDA) వెంచర్లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వలిగొండ రోడ్డులోని సురేష్ అనే వ్యక్తి ఇంట్లో కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు ఎస్హెచ్ఓ (SHO) కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, సబ్ ఇన్స్పెక్టర్ బి. అజయ్ భార్గవ్ తన సిబ్బందితో కలిసి రాత్రి 9:30 గంటల సమయంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతూ నలుగురు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
పట్టుబడ్డ వారు బొదుల శ్యామ్ (లింగారెడ్డిగూడెం) సుక్క నరసింహ (కాటమయ్య కాలనీ) ఉష్కాగుల సురేష్ (కేపీఆర్ నగర్) నందగిరి నరేష్ (రామ్ నగర్ కాలనీ) నిందితుల నుంచి రూ. 51,200 నగదుతో పాటు, 4 సెల్ఫోన్లు, 2 సెట్ల పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి