చౌటుప్పల్లో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' సమీక్ష
చౌటుప్పల్లో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' సమీక్ష
K.RAVI
ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు: మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రమైన చౌటుప్పల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి పి. రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి. సందీప్ కుమార్, తహసీల్దార్ వీరబాయి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె. అలువేలు, వివిధ గ్రామాల సర్పంచులు, అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నార
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి