చౌటుప్పల్లో ప్రైవేట్ ఫైనాన్స్ల ఆగడాలు
చౌటుప్పల్లో ప్రైవేట్ ఫైనాన్స్ల ఆగడాలు
K.RAVI
ప్రజల ప్రాణాలతో చెలగాటం – బాధితుల ఆవేదన
అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. డబ్బు అవసరమైన ప్రజలను గుర్తించి “ఎలాంటి సివిల్ వివరాలు అవసరం లేదు, డాక్యుమెంటేషన్ అవసరం లేదు” అంటూ టు-వీలర్ ఫైనాన్స్ పేరుతో ఆశ చూపించి అమాయకులను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నిబంధనలకు విరుద్ధంగాకార్యకలాపాలు
రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మార్గదర్శకాలు, స్థానిక మున్సిపాలిటీ, పోలీస్ అనుమతులు లేకుండానే కొంతమంది ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అధిక వడ్డీలు వసూలు చేయడం, రెండు మూడు ఈఎంఐలు ఆలస్యం అయితే అక్రమంగా వాహనాలను సీజ్ చేయడం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా పబ్లిక్ ఆక్షన్ లేకుండా విక్రయించడం వంటి చర్యలు బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.కస్టమర్లకు చట్టపరమైన సమస్యలు విక్రయించిన వాహనాలను కొత్త యజమానుల పేర్లకు మార్చకుండా పాత కస్టమర్ల పేర్లతోనే కొనసాగించడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఈ కారణంగా కొత్త కొనుగోలుదారులు కూడా ఇరుక్కుపోతున్నారు.అవగాహన లేమితో పెరుగుతున్న దౌర్జన్యాలు స్థానిక ప్రజల్లో చాలామంది నిరక్షరాస్యులు కావడం, చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలకు అదుపు లేకుండా పోయిందని సామాజిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారుల జోక్యం కోరుతూ…ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అంశాన్ని రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి, అక్రమంగా నడుస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ అక్రమ ఫైనాన్స్ వ్యవహారాలపై అధికారుల చర్యలు ఎప్పుడు?

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి