Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:10 AM

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్లకు వేగం

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్లకు వేగం

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్లకు వేగం
24-03-2026 263 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బకాయిదారులకు రెడ్ నోటీసులు.. ఆస్తుల సీజ్‌కు చర్యలు

2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పన్నుల వసూళ్లపై దృష్టి సారించింది. కలెక్షన్ టార్గెట్‌ను సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు.మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామ్ రెడ్డి పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.పట్టణ ప్రజలు తమ ఆస్తి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నులను గడువులోగా చెల్లించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పన్నులు సమయానికి చెల్లిస్తేనే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు మున్సిపాలిటీకి అందుతాయని, లేకపోతే నిధులు నిలిచిపోవచ్చని హెచ్చరించారు.అలసత్వం వహిస్తే చర్యలు మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య తెలిపారు. పన్నుల వసూళ్లలో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sthanikam

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్లకు వేగం

Article Image

బకాయిదారులకు రెడ్ నోటీసులు.. ఆస్తుల సీజ్‌కు చర్యలు

2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పన్నుల వసూళ్లపై దృష్టి సారించింది. కలెక్షన్ టార్గెట్‌ను సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు.మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామ్ రెడ్డి పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.పట్టణ ప్రజలు తమ ఆస్తి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నులను గడువులోగా చెల్లించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పన్నులు సమయానికి చెల్లిస్తేనే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు మున్సిపాలిటీకి అందుతాయని, లేకపోతే నిధులు నిలిచిపోవచ్చని హెచ్చరించారు.అలసత్వం వహిస్తే చర్యలు మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య తెలిపారు. పన్నుల వసూళ్లలో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News