Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 24, 2026 06:14 AM

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్లకు వేగం

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్లకు వేగం

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్లకు వేగం
March 24, 2026 04:17 AM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బకాయిదారులకు రెడ్ నోటీసులు.. ఆస్తుల సీజ్‌కు చర్యలు

2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పన్నుల వసూళ్లపై దృష్టి సారించింది. కలెక్షన్ టార్గెట్‌ను సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు.మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామ్ రెడ్డి పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.పట్టణ ప్రజలు తమ ఆస్తి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నులను గడువులోగా చెల్లించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పన్నులు సమయానికి చెల్లిస్తేనే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు మున్సిపాలిటీకి అందుతాయని, లేకపోతే నిధులు నిలిచిపోవచ్చని హెచ్చరించారు.అలసత్వం వహిస్తే చర్యలు మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య తెలిపారు. పన్నుల వసూళ్లలో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News