Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

చౌటుప్పల్‌లో నత్తనడకన రోడ్డు పనులు

చౌటుప్పల్‌లో నత్తనడకన రోడ్డు పనులు

చౌటుప్పల్‌లో నత్తనడకన రోడ్డు పనులు
April 06, 2026 07:28 PM 248 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు – త్వరితగతిన పూర్తి చేయాలి: ఎమ్మెల్సి నెలికంటి సత్యం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ నెలికంటి సత్యం అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ నాయకులతో కలిసి బస్టాండ్ ముందు జరుగుతున్న రోడ్డు, ఫ్లైఓవర్ పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల జాప్యం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యాపారులకు ఆర్థిక నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడత రామలింగం, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, దాసరి మనోహర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News