చౌటుప్పల్లో నత్తనడకన రోడ్డు పనులు
చౌటుప్పల్లో నత్తనడకన రోడ్డు పనులు
K.RAVI
వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు – త్వరితగతిన పూర్తి చేయాలి: ఎమ్మెల్సి నెలికంటి సత్యం
చౌటుప్పల్ మున్సిపాలిటీలో రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ నెలికంటి సత్యం అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ నాయకులతో కలిసి బస్టాండ్ ముందు జరుగుతున్న రోడ్డు, ఫ్లైఓవర్ పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులతో ఫోన్లో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల జాప్యం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యాపారులకు ఆర్థిక నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడత రామలింగం, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, దాసరి మనోహర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి