Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:09 PM

చౌటుప్పల్‌లో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్!

చౌటుప్పల్‌లో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్!

చౌటుప్పల్‌లో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్!
May 19, 2026 09:51 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* రూ. 22,223 నగదు బహుమతి ప్రకటించిన లింగోజిగూడెం కాంగ్రెస్ అధ్యక్షుడు పర్నె శివారెడ్డి

* జూన్ 1న ఘనంగా నిర్వహణకు యువజన కాంగ్రెస్ శ్రేణుల సన్నద్ధం

మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని చౌటుప్పల్ మండల పరిధిలో భారీ క్రికెట్ టోర్నమెంట్‌కు తెరలేవనుంది. చౌటుప్పల్ యువజన కాంగ్రెస్ (యూత్ కాంగ్రెస్) ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన ఈ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ టోర్నమెంట్‌లో విజేతలకు అందించేందుకు లింగోజిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్నె శివారెడ్డి రూ. 22,223/- (ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు) నగదు బహుమతిని (ప్రైజ్ మనీ) స్వచ్ఛందంగా ప్రకటించారు.స్థానిక ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించే ఈ పోటీలపై చౌటుప్పల్ పరిధిలోని క్రీడాకారులు, యువత తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. బహుమతి మొత్తాన్ని ప్రకటించిన పర్నె శివారెడ్డికి, టోర్నమెంట్ నిర్వాహకులకు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, యువజన కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జూన్ 1న జరిగే ఈ వేడుకలను, టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News