చౌటుప్పల్లో మెడికల్ షాపుల బంద్ విజయవంతం
చౌటుప్పల్లో మెడికల్ షాపుల బంద్ విజయవంతం
K.RAVI
ఆల్ ఇండియా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపులో భాగంగా బుధవారం చౌటుప్పల్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులంతా కలిసి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరందాస్ ధనుంజయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలెవరూ ఆన్లైన్లో మందులు కొనుగోలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మందుల వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యాడపు ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి తిరందాస్ వెంకటేష్, ఉపాధ్యక్షులు గర్దాస్ నరసింహ, దౌడల రమేష్, తూర్పునూరు వెంకటేష్, కార్యవర్గ సభ్యులు కటికం ప్రశాంత్, రచ్చ వెంకటరమణ, భాస్కర్, శ్రీకాంత్, వినోద్ కుమార్, రాజు, గణేష్, శ్రవణ్ కుమార్, ఫార్మసిస్ట్లు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి