Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

చౌటుప్పల్‌లో జాకీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభం

చౌటుప్పల్‌లో జాకీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభం

చౌటుప్పల్‌లో జాకీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభం
03-04-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని భాస్కర్ టాకీస్ పక్కన జాకీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమానులు శంకర్–కుమారి దంపతులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షాపు యజమానులు చైర్మన్ దంపతులను పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ..ఈ స్టోర్ యువతను, స్టైల్ పట్ల శ్రద్ధ వహించే వారిని ఆకట్టుకునేలా ఆధునికంగా రూపొందించామని తెలిపారు. పురుషులు, మహిళలు, పిల్లల కోసం విస్తృత శ్రేణి దుస్తులు, లోదుస్తులు అందుబాటులో ఉంటాయని, వినియోగదారులకు సరసమైన ధరలకే అందిస్తున్నామని చెప్పారు.జాకీ సంస్థ 1876లో స్థాపించబడిందని, నాణ్యతకు ప్రతీకగా నిలిచిన ప్రముఖ బ్రాండ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, బత్తుల వాణి విప్లవ్ గౌడ్, బుడ్డ సురేష్, ప్రముఖ వ్యాపారవేత్త మంచికంటి భాస్కర్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ నాయకులు తొర్పునూరి నరసింహ గౌడ్, పబ్బు శ్రీకాంత్, గోషిక నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో జాకీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభం

Article Image

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని భాస్కర్ టాకీస్ పక్కన జాకీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమానులు శంకర్–కుమారి దంపతులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షాపు యజమానులు చైర్మన్ దంపతులను పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ..ఈ స్టోర్ యువతను, స్టైల్ పట్ల శ్రద్ధ వహించే వారిని ఆకట్టుకునేలా ఆధునికంగా రూపొందించామని తెలిపారు. పురుషులు, మహిళలు, పిల్లల కోసం విస్తృత శ్రేణి దుస్తులు, లోదుస్తులు అందుబాటులో ఉంటాయని, వినియోగదారులకు సరసమైన ధరలకే అందిస్తున్నామని చెప్పారు.జాకీ సంస్థ 1876లో స్థాపించబడిందని, నాణ్యతకు ప్రతీకగా నిలిచిన ప్రముఖ బ్రాండ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, బత్తుల వాణి విప్లవ్ గౌడ్, బుడ్డ సురేష్, ప్రముఖ వ్యాపారవేత్త మంచికంటి భాస్కర్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ నాయకులు తొర్పునూరి నరసింహ గౌడ్, పబ్బు శ్రీకాంత్, గోషిక నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News