Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 09:30 PM

చౌటుప్పల్‌లో జాకీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభం

చౌటుప్పల్‌లో జాకీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభం

చౌటుప్పల్‌లో జాకీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభం
April 03, 2026 07:37 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని భాస్కర్ టాకీస్ పక్కన జాకీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమానులు శంకర్–కుమారి దంపతులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షాపు యజమానులు చైర్మన్ దంపతులను పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ..ఈ స్టోర్ యువతను, స్టైల్ పట్ల శ్రద్ధ వహించే వారిని ఆకట్టుకునేలా ఆధునికంగా రూపొందించామని తెలిపారు. పురుషులు, మహిళలు, పిల్లల కోసం విస్తృత శ్రేణి దుస్తులు, లోదుస్తులు అందుబాటులో ఉంటాయని, వినియోగదారులకు సరసమైన ధరలకే అందిస్తున్నామని చెప్పారు.జాకీ సంస్థ 1876లో స్థాపించబడిందని, నాణ్యతకు ప్రతీకగా నిలిచిన ప్రముఖ బ్రాండ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, బత్తుల వాణి విప్లవ్ గౌడ్, బుడ్డ సురేష్, ప్రముఖ వ్యాపారవేత్త మంచికంటి భాస్కర్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ నాయకులు తొర్పునూరి నరసింహ గౌడ్, పబ్బు శ్రీకాంత్, గోషిక నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News