చౌటుప్పల్లో జాకీ ఎక్స్క్లూజివ్ స్టోర్ ప్రారంభం
చౌటుప్పల్లో జాకీ ఎక్స్క్లూజివ్ స్టోర్ ప్రారంభం
K.RAVI
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని భాస్కర్ టాకీస్ పక్కన జాకీ ఎక్స్క్లూజివ్ స్టోర్ను శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమానులు శంకర్–కుమారి దంపతులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షాపు యజమానులు చైర్మన్ దంపతులను పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ..ఈ స్టోర్ యువతను, స్టైల్ పట్ల శ్రద్ధ వహించే వారిని ఆకట్టుకునేలా ఆధునికంగా రూపొందించామని తెలిపారు. పురుషులు, మహిళలు, పిల్లల కోసం విస్తృత శ్రేణి దుస్తులు, లోదుస్తులు అందుబాటులో ఉంటాయని, వినియోగదారులకు సరసమైన ధరలకే అందిస్తున్నామని చెప్పారు.జాకీ సంస్థ 1876లో స్థాపించబడిందని, నాణ్యతకు ప్రతీకగా నిలిచిన ప్రముఖ బ్రాండ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, బత్తుల వాణి విప్లవ్ గౌడ్, బుడ్డ సురేష్, ప్రముఖ వ్యాపారవేత్త మంచికంటి భాస్కర్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ నాయకులు తొర్పునూరి నరసింహ గౌడ్, పబ్బు శ్రీకాంత్, గోషిక నరసింహ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి