చౌటుప్పల్లో ఘనంగా మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్
చౌటుప్పల్లో ఘనంగా మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్
K.RAVI
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ పి ఎస్ టి మండల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ను ఘనంగా నిర్వహించారు. విజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ పరీక్ష నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి గురువారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, శాస్త్ర విజ్ఞానం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యార్థులు చిన్ననాటి నుంచే పరిశోధనా దృక్పథంఅలవరచుకోవాలని సూచించారు. స్థానిక పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శివ కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న కోమటిరెడ్డి నరసింహారెడ్డి విజేతలకు నగదు బహుమతులు అందజేసి అభినందించారు.టాలెంట్ టెస్ట్లో జి. చరణ్ (జెడ్పీహెచ్ఎస్, చౌటుప్పల్) ప్రథమ బహుమతి, ఎల్. శ్రీజ (జెడ్పీహెచ్ఎస్, తంగడిపల్లి) ద్వితీయ బహుమతి సాధించారు.ఈ కార్యక్రమంలో టాలెంట్ టెస్ట్ ఇంచార్జ్ వి ఏ కె జోషి, మహేందర్ రెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి