చౌటుప్పల్లో విద్యుత్ సమస్యలకు చెక్
చౌటుప్పల్లో విద్యుత్ సమస్యలకు చెక్
K.RAVI
19, 12వ వార్డుల్లో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ల ప్రారంభం
ప్రజల సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ కీలక అడుగు
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19, 12వ వార్డుల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కెవి ట్రాన్స్ఫార్మర్లను మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు.19వ వార్డులో విద్యుత్ లోపంతో గృహిణులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ ఈ సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మున్సిపల్ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన నూతన ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేసి ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. 19వ వార్డులో విద్యుత్ సమస్యను పూర్తిగా తొలగించడమే కాకుండా, రాబోయే రోజుల్లో అన్ని మౌలిక వసతులను అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, మొగుదాల రమేష్ గౌడ్, ఎస్.కే. జానీ బాబు, దేప రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్ గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్, వర్కాల రాము గౌడ్, ఇప్ప వెంకటేష్, మలిగే మల్లేష్, రవితేజ తదితర నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి