Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

చౌటుప్పల్‌లో బీసీ బాలురకు వసతి గృహం ఏర్పాటు చేయాలి

చౌటుప్పల్‌లో బీసీ బాలురకు వసతి గృహం ఏర్పాటు చేయాలి

చౌటుప్పల్‌లో బీసీ బాలురకు వసతి గృహం ఏర్పాటు చేయాలి
March 23, 2026 07:53 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కలెక్టరేట్‌లో ఎస్ఎఫ్ఐ వినతి – విద్యార్థుల ఇబ్బందులు వెల్లడి

చౌటుప్పల్ పట్టణంలో వెనుకబడిన తరగతుల (బీసీ) బాలుర కోసం కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు డిమాండ్ చేశారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్‌తో కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా లావుడియ రాజు మాట్లాడుతూ, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న చౌటుప్పల్ పట్టణంలో కళాశాల వసతి గృహం లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

వేలాది మంది విద్యార్థులకు ఇబ్బందులు పట్టణంలో దాదాపు 10 నుండి 12 వరకు డిగ్రీ, జూనియర్ కళాశాలలు ఉన్నాయని, మారుమూల గ్రామాల నుండి రోజూ 3,000 నుండి 5,000 మంది విద్యార్థులు చదువుకోడానికి చౌటుప్పల్‌కు వస్తున్నారని చెప్పారు.బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు గ్రామాల నుండి సరైన రవాణా సౌకర్యం లేక విద్యార్థులు సమయానికి కళాశాలలకు చేరుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే వసతి గృహం ఏర్పాటు చేయాలి కళాశాల వసతి గృహం ఏర్పాటు చేస్తే విద్యార్థులు సౌకర్యవంతంగా చదువులు కొనసాగించగలరని, ప్రభుత్వం తక్షణమే స్పందించి చౌటుప్పల్‌లో వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News