చౌటుప్పల్లో బీసీ బాలురకు వసతి గృహం ఏర్పాటు చేయాలి
చౌటుప్పల్లో బీసీ బాలురకు వసతి గృహం ఏర్పాటు చేయాలి
K.RAVI
కలెక్టరేట్లో ఎస్ఎఫ్ఐ వినతి – విద్యార్థుల ఇబ్బందులు వెల్లడి
చౌటుప్పల్ పట్టణంలో వెనుకబడిన తరగతుల (బీసీ) బాలుర కోసం కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు డిమాండ్ చేశారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్తో కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా లావుడియ రాజు మాట్లాడుతూ, హైదరాబాద్కు సమీపంలో ఉన్న చౌటుప్పల్ పట్టణంలో కళాశాల వసతి గృహం లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వేలాది మంది విద్యార్థులకు ఇబ్బందులు పట్టణంలో దాదాపు 10 నుండి 12 వరకు డిగ్రీ, జూనియర్ కళాశాలలు ఉన్నాయని, మారుమూల గ్రామాల నుండి రోజూ 3,000 నుండి 5,000 మంది విద్యార్థులు చదువుకోడానికి చౌటుప్పల్కు వస్తున్నారని చెప్పారు.బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు గ్రామాల నుండి సరైన రవాణా సౌకర్యం లేక విద్యార్థులు సమయానికి కళాశాలలకు చేరుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే వసతి గృహం ఏర్పాటు చేయాలి కళాశాల వసతి గృహం ఏర్పాటు చేస్తే విద్యార్థులు సౌకర్యవంతంగా చదువులు కొనసాగించగలరని, ప్రభుత్వం తక్షణమే స్పందించి చౌటుప్పల్లో వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి