Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

చౌటుప్పల్‌లో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చౌటుప్పల్‌లో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చౌటుప్పల్‌లో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
April 06, 2026 04:27 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పార్టీ పతాకావిష్కరణ – దీన్ దయాళ్ ఉపాధ్యాయకు నివాళులు

చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షులు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగరవేశారు.పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్టీ స్థాపించి 46 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షం గౌడ్, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రమణగోని శంకరయ్య, సీనియర్ నాయకులు ముత్యాల భూపాల్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, దిండు భాస్కర్, 2వ వార్డ్ కౌన్సిలర్ పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, 6వ వార్డ్ కౌన్సిలర్ ఆలే శ్రీలత చిరంజీవి, 18వ వార్డ్ కౌన్సిలర్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బుడ్డ సురేష్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, కాసుల వెంకటేశం గౌడ్, ఉడుగు వెంకటేశం గౌడ్, కడారి ఐలయ్య యాదవ్, గోషిక పురుషోత్తం, వరగంటి భాను ప్రకాష్, వంగాల రాము, గుండెబోయిన వేణు, బూత్ అధ్యక్షులు బాతరాజు ప్రవీణ్, ఇటికాల దామోదర్ రెడ్డి, మార్గం స్వామి, కాసోజు కనకాచారి, గోషిక ధనుంజయ, గోషిక భావన ఋషి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News