చౌటుప్పల్కు నూతన మున్సిపల్ వైస్ చైర్మన్
చౌటుప్పల్కు నూతన మున్సిపల్ వైస్ చైర్మన్
K.RAVI
11వ వార్డు కౌన్సిలర్ గోశిక వినయ్ కుమార్ ఎన్నిక
చౌటుప్పల్ మున్సిపాలిటీకి నూతన వైస్ చైర్మన్గా 11వ వార్డు కౌన్సిలర్ గోశిక వినయ్ కుమార్ ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిల్ సభ్యుల మద్దతుతో ఆయన ఈ పదవిని చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా పారదర్శకంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి దిశగా అడుగులు కాంగ్రెస్ నాయకత్వానికి వినయ్ కుమార్ కృతజ్ఞతలు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని వినయ్ కుమార్ పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కౌన్సిలర్లు, మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి