చౌటుప్పల్కు నీటి కష్టాలు రానివ్వం
చౌటుప్పల్కు నీటి కష్టాలు రానివ్వం
K.RAVI
అవసరమైతే ప్రైవేట్ బోర్లు, అదనపు ట్యాంకర్లు
అత్యవసర కౌన్సిల్ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆదేశాలు
వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు సూచించారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆయన వార్డుల వారీగా నీటి సమస్యలపై కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించారు.రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులకు సమానంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని చైర్పర్సన్కు సూచించిన ఆయన.. కమిషనర్, ఏఈలు, వాటర్మెన్లు సమన్వయంతో పనిచేసి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. పట్టణంలోని నీటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే సమృద్ధిగా నీరు ఉన్న బోర్లను గుర్తించామని తెలిపారు. అవసరమైన చోట ప్రైవేట్ బోర్లను లీజుకు తీసుకుంటున్నామని, అదనంగా మరో ఆరు నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ మాట్లాడుతూ.. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకుంటూ టెక్నికల్ టీం, వాటర్మెన్లతో సమన్వయం చేసుకుని నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్కుమార్, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఆర్వో అంజయ్య, ఏఈ నితీష్కుమార్, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, టిడబ్ల్యూఐ సంతోష్కుమార్, వాటర్మెన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి