Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

చౌటుప్పల్‌కు నీటి కష్టాలు రానివ్వం

చౌటుప్పల్‌కు నీటి కష్టాలు రానివ్వం

చౌటుప్పల్‌కు నీటి కష్టాలు రానివ్వం
15-05-2026 200 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అవసరమైతే ప్రైవేట్ బోర్లు, అదనపు ట్యాంకర్లు

అత్యవసర కౌన్సిల్ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశాలు

వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆయన వార్డుల వారీగా నీటి సమస్యలపై కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించారు.రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులకు సమానంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని చైర్‌పర్సన్‌కు సూచించిన ఆయన.. కమిషనర్, ఏఈలు, వాటర్‌మెన్లు సమన్వయంతో పనిచేసి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. పట్టణంలోని నీటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే సమృద్ధిగా నీరు ఉన్న బోర్లను గుర్తించామని తెలిపారు. అవసరమైన చోట ప్రైవేట్ బోర్లను లీజుకు తీసుకుంటున్నామని, అదనంగా మరో ఆరు నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ మాట్లాడుతూ.. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకుంటూ టెక్నికల్ టీం, వాటర్‌మెన్లతో సమన్వయం చేసుకుని నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్‌కుమార్, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఆర్‌వో అంజయ్య, ఏఈ నితీష్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, టిడబ్ల్యూఐ సంతోష్‌కుమార్, వాటర్‌మెన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌కు నీటి కష్టాలు రానివ్వం

Article Image

అవసరమైతే ప్రైవేట్ బోర్లు, అదనపు ట్యాంకర్లు

అత్యవసర కౌన్సిల్ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశాలు

వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆయన వార్డుల వారీగా నీటి సమస్యలపై కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించారు.రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులకు సమానంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని చైర్‌పర్సన్‌కు సూచించిన ఆయన.. కమిషనర్, ఏఈలు, వాటర్‌మెన్లు సమన్వయంతో పనిచేసి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. పట్టణంలోని నీటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే సమృద్ధిగా నీరు ఉన్న బోర్లను గుర్తించామని తెలిపారు. అవసరమైన చోట ప్రైవేట్ బోర్లను లీజుకు తీసుకుంటున్నామని, అదనంగా మరో ఆరు నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ మాట్లాడుతూ.. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకుంటూ టెక్నికల్ టీం, వాటర్‌మెన్లతో సమన్వయం చేసుకుని నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్‌కుమార్, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఆర్‌వో అంజయ్య, ఏఈ నితీష్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, టిడబ్ల్యూఐ సంతోష్‌కుమార్, వాటర్‌మెన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News