Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

చౌటుప్పల్‌కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి

చౌటుప్పల్‌కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి

చౌటుప్పల్‌కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి
March 25, 2026 05:14 PM 231 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నియోజకవర్గ సాధన సమితి వినతి – 7 మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్

చౌటుప్పల్‌ను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని చౌటుప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో, చౌటుప్పల్‌ను కూడా ఇందులో చేర్చాలని కోరారు.ఈ మేరకు నేడు చౌటుప్పల్ ఆర్డీఓ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.దాదాపు 7 మండలాల ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం ప్రతిరోజూ వేల సంఖ్యలో చౌటుప్పల్‌కు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న జనాభా, అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాంతానికి అసెంబ్లీ నియోజకవర్గ హోదా అవసరమని పేర్కొన్నారు.

చౌటుప్పల్‌ను కేంద్రంగా చేసుకుని నారాయణపూర్, గట్టుప్పల్, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, పోచంపల్లి మండలాలను కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కట్టెల లింగస్వామి, బర్రె రాజు పెరియార్, బోయ కుమార్, దాసరి ప్రకాష్, పంది రాకేష్, చేకూరి బాబు, నేరడి మహేష్, కట్టెల ప్రకాష్, సిరిపంగి చందు, చిత్రాల హరిప్రసాద్, పగిళ్ళ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News