Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:08 AM

చౌటుప్పల్‌కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి

చౌటుప్పల్‌కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి

చౌటుప్పల్‌కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి
25-03-2026 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నియోజకవర్గ సాధన సమితి వినతి – 7 మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్

చౌటుప్పల్‌ను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని చౌటుప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో, చౌటుప్పల్‌ను కూడా ఇందులో చేర్చాలని కోరారు.ఈ మేరకు నేడు చౌటుప్పల్ ఆర్డీఓ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.దాదాపు 7 మండలాల ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం ప్రతిరోజూ వేల సంఖ్యలో చౌటుప్పల్‌కు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న జనాభా, అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాంతానికి అసెంబ్లీ నియోజకవర్గ హోదా అవసరమని పేర్కొన్నారు.

చౌటుప్పల్‌ను కేంద్రంగా చేసుకుని నారాయణపూర్, గట్టుప్పల్, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, పోచంపల్లి మండలాలను కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కట్టెల లింగస్వామి, బర్రె రాజు పెరియార్, బోయ కుమార్, దాసరి ప్రకాష్, పంది రాకేష్, చేకూరి బాబు, నేరడి మహేష్, కట్టెల ప్రకాష్, సిరిపంగి చందు, చిత్రాల హరిప్రసాద్, పగిళ్ళ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి

Article Image

నియోజకవర్గ సాధన సమితి వినతి – 7 మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్

చౌటుప్పల్‌ను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని చౌటుప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో, చౌటుప్పల్‌ను కూడా ఇందులో చేర్చాలని కోరారు.ఈ మేరకు నేడు చౌటుప్పల్ ఆర్డీఓ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.దాదాపు 7 మండలాల ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం ప్రతిరోజూ వేల సంఖ్యలో చౌటుప్పల్‌కు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న జనాభా, అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాంతానికి అసెంబ్లీ నియోజకవర్గ హోదా అవసరమని పేర్కొన్నారు.

చౌటుప్పల్‌ను కేంద్రంగా చేసుకుని నారాయణపూర్, గట్టుప్పల్, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, పోచంపల్లి మండలాలను కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కట్టెల లింగస్వామి, బర్రె రాజు పెరియార్, బోయ కుమార్, దాసరి ప్రకాష్, పంది రాకేష్, చేకూరి బాబు, నేరడి మహేష్, కట్టెల ప్రకాష్, సిరిపంగి చందు, చిత్రాల హరిప్రసాద్, పగిళ్ళ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News