చౌటుప్పల్కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి
చౌటుప్పల్కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి
K.RAVI
నియోజకవర్గ సాధన సమితి వినతి – 7 మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్
చౌటుప్పల్ను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని చౌటుప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో, చౌటుప్పల్ను కూడా ఇందులో చేర్చాలని కోరారు.ఈ మేరకు నేడు చౌటుప్పల్ ఆర్డీఓ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.దాదాపు 7 మండలాల ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం ప్రతిరోజూ వేల సంఖ్యలో చౌటుప్పల్కు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న జనాభా, అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాంతానికి అసెంబ్లీ నియోజకవర్గ హోదా అవసరమని పేర్కొన్నారు.
చౌటుప్పల్ను కేంద్రంగా చేసుకుని నారాయణపూర్, గట్టుప్పల్, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, పోచంపల్లి మండలాలను కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కట్టెల లింగస్వామి, బర్రె రాజు పెరియార్, బోయ కుమార్, దాసరి ప్రకాష్, పంది రాకేష్, చేకూరి బాబు, నేరడి మహేష్, కట్టెల ప్రకాష్, సిరిపంగి చందు, చిత్రాల హరిప్రసాద్, పగిళ్ళ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి