PRINT TIME: April 10, 2026 01:37 AM
చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు
చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు
February 23, 2026 04:31 PM
150 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
నేటి నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన సేవలు
పాత కార్యాలయానికి రావొద్దని సూచన
చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మారినట్లు తహశీల్దార్ వీరాబాయి తెలిపారు. ఇప్పటివరకు కొనసాగిన ఎమ్మార్వో కార్యాలయం సేవలు ఇకపై కొత్త ప్రాంగణంలోనే అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.నేటి నుంచే కొత్త కార్యాలయంలో సేవలు పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలో రెవెన్యూ సేవలు ప్రారంభమైనట్లు తెలిపారు. భూ సంబంధిత పనులు, ధ్రువపత్రాలు తదితర సేవల కోసం వచ్చే ప్రజలు పాత భవనానికి కాకుండా కొత్త కార్యాలయానికే రావాలని సూచించారు. ప్రజల సహకారం కోరిన తహశీల్దార్ కార్యాలయం మార్పును ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని తహశీల్దార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాలతో సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి