Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:16 AM

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు
April 03, 2026 08:19 PM 316 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామ పరిధిలో చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరోకరికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం, 02.04.2026 సాయంత్రం సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కొబ్బరి బోండాల లోడుతో నాలుగు అశోక్ లేలాండ్ వాహనాలు హైదరాబాద్ వైపుబయలుదేరాయి. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మల్కాపురం గ్రామం చెరువు సమీపానికి చేరుకున్నప్పుడు AP39WJ5348 నంబరు గల వాహనం టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ పల్లా నవీన్ కుమార్ వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ లైట్ వేసి ఆపాడు. మిగిలిన మూడు వాహనాలు కూడా ముందుగా ఆపి టైర్ మారుస్తుండగా, అదే దారిలో వస్తున్న KA56 7370 నంబరు గల లారీ కంటైనర్ డ్రైవర్ ప్రకాష్ అతివేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో సాధనాల లక్ష్మీ నరసింహ స్వామి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాసపోలి కనకరాజుకు కుడి కాలికి గాయమయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పల్లా నవీన్ కుమార్ (27) చికిత్స పొందుతూ ఉదయం సుమారు 5 గంటల సమయంలో మృతి చెందాడు.ఈ ఘటనపై పల్లా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News