Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:11 AM

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు
03-04-2026 319 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామ పరిధిలో చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరోకరికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం, 02.04.2026 సాయంత్రం సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కొబ్బరి బోండాల లోడుతో నాలుగు అశోక్ లేలాండ్ వాహనాలు హైదరాబాద్ వైపుబయలుదేరాయి. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మల్కాపురం గ్రామం చెరువు సమీపానికి చేరుకున్నప్పుడు AP39WJ5348 నంబరు గల వాహనం టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ పల్లా నవీన్ కుమార్ వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ లైట్ వేసి ఆపాడు. మిగిలిన మూడు వాహనాలు కూడా ముందుగా ఆపి టైర్ మారుస్తుండగా, అదే దారిలో వస్తున్న KA56 7370 నంబరు గల లారీ కంటైనర్ డ్రైవర్ ప్రకాష్ అతివేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో సాధనాల లక్ష్మీ నరసింహ స్వామి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాసపోలి కనకరాజుకు కుడి కాలికి గాయమయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పల్లా నవీన్ కుమార్ (27) చికిత్స పొందుతూ ఉదయం సుమారు 5 గంటల సమయంలో మృతి చెందాడు.ఈ ఘటనపై పల్లా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు

Article Image

చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామ పరిధిలో చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరోకరికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం, 02.04.2026 సాయంత్రం సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కొబ్బరి బోండాల లోడుతో నాలుగు అశోక్ లేలాండ్ వాహనాలు హైదరాబాద్ వైపుబయలుదేరాయి. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మల్కాపురం గ్రామం చెరువు సమీపానికి చేరుకున్నప్పుడు AP39WJ5348 నంబరు గల వాహనం టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ పల్లా నవీన్ కుమార్ వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ లైట్ వేసి ఆపాడు. మిగిలిన మూడు వాహనాలు కూడా ముందుగా ఆపి టైర్ మారుస్తుండగా, అదే దారిలో వస్తున్న KA56 7370 నంబరు గల లారీ కంటైనర్ డ్రైవర్ ప్రకాష్ అతివేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో సాధనాల లక్ష్మీ నరసింహ స్వామి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాసపోలి కనకరాజుకు కుడి కాలికి గాయమయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పల్లా నవీన్ కుమార్ (27) చికిత్స పొందుతూ ఉదయం సుమారు 5 గంటల సమయంలో మృతి చెందాడు.ఈ ఘటనపై పల్లా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News