Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 09:56 PM

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు
April 03, 2026 08:19 PM 172 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామ పరిధిలో చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరోకరికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం, 02.04.2026 సాయంత్రం సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కొబ్బరి బోండాల లోడుతో నాలుగు అశోక్ లేలాండ్ వాహనాలు హైదరాబాద్ వైపుబయలుదేరాయి. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మల్కాపురం గ్రామం చెరువు సమీపానికి చేరుకున్నప్పుడు AP39WJ5348 నంబరు గల వాహనం టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ పల్లా నవీన్ కుమార్ వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ లైట్ వేసి ఆపాడు. మిగిలిన మూడు వాహనాలు కూడా ముందుగా ఆపి టైర్ మారుస్తుండగా, అదే దారిలో వస్తున్న KA56 7370 నంబరు గల లారీ కంటైనర్ డ్రైవర్ ప్రకాష్ అతివేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో సాధనాల లక్ష్మీ నరసింహ స్వామి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాసపోలి కనకరాజుకు కుడి కాలికి గాయమయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పల్లా నవీన్ కుమార్ (27) చికిత్స పొందుతూ ఉదయం సుమారు 5 గంటల సమయంలో మృతి చెందాడు.ఈ ఘటనపై పల్లా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News