చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు
చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు
K.RAVI
చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామ పరిధిలో చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరోకరికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం, 02.04.2026 సాయంత్రం సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కొబ్బరి బోండాల లోడుతో నాలుగు అశోక్ లేలాండ్ వాహనాలు హైదరాబాద్ వైపుబయలుదేరాయి. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మల్కాపురం గ్రామం చెరువు సమీపానికి చేరుకున్నప్పుడు AP39WJ5348 నంబరు గల వాహనం టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ పల్లా నవీన్ కుమార్ వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ లైట్ వేసి ఆపాడు. మిగిలిన మూడు వాహనాలు కూడా ముందుగా ఆపి టైర్ మారుస్తుండగా, అదే దారిలో వస్తున్న KA56 7370 నంబరు గల లారీ కంటైనర్ డ్రైవర్ ప్రకాష్ అతివేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో సాధనాల లక్ష్మీ నరసింహ స్వామి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాసపోలి కనకరాజుకు కుడి కాలికి గాయమయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పల్లా నవీన్ కుమార్ (27) చికిత్స పొందుతూ ఉదయం సుమారు 5 గంటల సమయంలో మృతి చెందాడు.ఈ ఘటనపై పల్లా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి