చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ పావని వినూత్న పిలుపు
చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ పావని వినూత్న పిలుపు
K.RAVI
బొకేలు, శాలువాలకు బదులు విద్యా సామాగ్రి అందించండి
చౌటుప్పల్ నూతన మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన మొగుదాల పావని రమేష్ గౌడ్ తన సన్మాన కార్యక్రమాల్లో బొకేలు,శాలువాలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి అందించాలని పిలుపునిచ్చారు.ప్రజాప్రతినిధులుగా సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు.
మున్సిపాలిటీ 14వ వార్డు గణేష్ నగర్కు చెందిన ప్రముఖ ఎన్జీఓ కార్యకర్తలు ఒరగంటి శ్రీను, ఒరగంటి నరసింహ సోదరులు చైర్పర్సన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని తెలిపారు.
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ
ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్న పావని నిర్ణయం
తన పిలుపు మేరకు చౌటుప్పల్ హైస్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేసిన ఒరగంటి శ్రీనును చైర్పర్సన్ అభినందించారు. అనంతరం ఒరగంటి శ్రీను గౌడ్ మాట్లాడుతూ, నూతన మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన పావని రమేష్ గౌడ్, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
సన్మాన కార్యక్రమాల్లో ఆర్భాటాలకు దూరంగా ఉండి విద్యా సామాగ్రి అందించాలని ఇచ్చిన పిలుపు ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పావని రమేష్ గౌడ్ పిలుపు మేరకు పరీక్షల కోసం అవసరమైన విద్యా సామాగ్రిని అందజేశామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి