Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:20 AM

చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పావని వినూత్న పిలుపు

చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పావని వినూత్న పిలుపు

చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పావని వినూత్న పిలుపు
18-02-2026 452 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బొకేలు, శాలువాలకు బదులు విద్యా సామాగ్రి అందించండి

చౌటుప్పల్ నూతన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన మొగుదాల పావని రమేష్ గౌడ్ తన సన్మాన కార్యక్రమాల్లో బొకేలు,శాలువాలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి అందించాలని పిలుపునిచ్చారు.ప్రజాప్రతినిధులుగా సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు.

మున్సిపాలిటీ 14వ వార్డు గణేష్ నగర్‌కు చెందిన ప్రముఖ ఎన్జీఓ కార్యకర్తలు ఒరగంటి శ్రీను, ఒరగంటి నరసింహ సోదరులు చైర్‌పర్సన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు.

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్న పావని నిర్ణయం

తన పిలుపు మేరకు చౌటుప్పల్ హైస్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేసిన ఒరగంటి శ్రీనును చైర్‌పర్సన్ అభినందించారు. అనంతరం ఒరగంటి శ్రీను గౌడ్ మాట్లాడుతూ, నూతన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పావని రమేష్ గౌడ్, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

సన్మాన కార్యక్రమాల్లో ఆర్భాటాలకు దూరంగా ఉండి విద్యా సామాగ్రి అందించాలని ఇచ్చిన పిలుపు ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పావని రమేష్ గౌడ్ పిలుపు మేరకు పరీక్షల కోసం అవసరమైన విద్యా సామాగ్రిని అందజేశామని తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పావని వినూత్న పిలుపు

Article Image

బొకేలు, శాలువాలకు బదులు విద్యా సామాగ్రి అందించండి

చౌటుప్పల్ నూతన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన మొగుదాల పావని రమేష్ గౌడ్ తన సన్మాన కార్యక్రమాల్లో బొకేలు,శాలువాలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి అందించాలని పిలుపునిచ్చారు.ప్రజాప్రతినిధులుగా సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు.

మున్సిపాలిటీ 14వ వార్డు గణేష్ నగర్‌కు చెందిన ప్రముఖ ఎన్జీఓ కార్యకర్తలు ఒరగంటి శ్రీను, ఒరగంటి నరసింహ సోదరులు చైర్‌పర్సన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు.

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్న పావని నిర్ణయం

తన పిలుపు మేరకు చౌటుప్పల్ హైస్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేసిన ఒరగంటి శ్రీనును చైర్‌పర్సన్ అభినందించారు. అనంతరం ఒరగంటి శ్రీను గౌడ్ మాట్లాడుతూ, నూతన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పావని రమేష్ గౌడ్, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

సన్మాన కార్యక్రమాల్లో ఆర్భాటాలకు దూరంగా ఉండి విద్యా సామాగ్రి అందించాలని ఇచ్చిన పిలుపు ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పావని రమేష్ గౌడ్ పిలుపు మేరకు పరీక్షల కోసం అవసరమైన విద్యా సామాగ్రిని అందజేశామని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News