Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:11 PM

చౌటుప్పల్ మార్కెట్ యార్డ్‌లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”

చౌటుప్పల్ మార్కెట్ యార్డ్‌లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”

చౌటుప్పల్ మార్కెట్ యార్డ్‌లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”
May 06, 2026 05:54 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రైతులకు సౌకర్యాలు, పథకాలపై అవగాహన

వ్యవసాయ మార్కెట్ కమిటీ చౌటుప్పల్ ఆధ్వర్యంలో బుధవారం మార్కెట్ యార్డ్‌లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మార్కెటింగ్ శాఖ ద్వారా తార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ఆటోమేటిక్ వడ్లు పట్టే యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే మార్కెటింగ్ శాఖ ప్రాముఖ్యత, రైతు బంధు, రైతు భీమా పథకాలపై వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా వాణిజ్య పంటల మార్పిడి, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆదర్శ రైతులను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుథాల పావణి రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి, పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ చేనగోని అంజయ్య, ఎ డి ఎ వెంకటేశ్వర్లు, ఎమ్ ఎ ఓ నాగరాజు,ఆర్ ఐ సుధాకర్ రావు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ భాగ్యశ్రీ, కోఆపరేటివ్ సొసైటీ అధికారి సురేష్,ఎ ఈ ఓ శ్రావ్య, మార్కెట్ కమిటీ సభ్యులు డిల్లీ చంద్రకళ, పబ్బు శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు చింతల ఉమామహేశ్వరి సాయిలు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి వి. రవీందర్ రెడ్డి, ఎ పి ఎమ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News