Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా టి.ఎల్. సంగీత పదవీ బాధ్యతలు స్వీకారం పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం பதவியேற்கும் முன்பே விஜய் அதிரடி தீர்மானம்! డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 07:08 PM

చౌటుప్పల్ మార్కెట్ యార్డ్‌లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”

చౌటుప్పల్ మార్కెట్ యార్డ్‌లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”

చౌటుప్పల్ మార్కెట్ యార్డ్‌లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”
May 06, 2026 05:54 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రైతులకు సౌకర్యాలు, పథకాలపై అవగాహన

వ్యవసాయ మార్కెట్ కమిటీ చౌటుప్పల్ ఆధ్వర్యంలో బుధవారం మార్కెట్ యార్డ్‌లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మార్కెటింగ్ శాఖ ద్వారా తార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ఆటోమేటిక్ వడ్లు పట్టే యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే మార్కెటింగ్ శాఖ ప్రాముఖ్యత, రైతు బంధు, రైతు భీమా పథకాలపై వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా వాణిజ్య పంటల మార్పిడి, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆదర్శ రైతులను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుథాల పావణి రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి, పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ చేనగోని అంజయ్య, ఎ డి ఎ వెంకటేశ్వర్లు, ఎమ్ ఎ ఓ నాగరాజు,ఆర్ ఐ సుధాకర్ రావు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ భాగ్యశ్రీ, కోఆపరేటివ్ సొసైటీ అధికారి సురేష్,ఎ ఈ ఓ శ్రావ్య, మార్కెట్ కమిటీ సభ్యులు డిల్లీ చంద్రకళ, పబ్బు శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు చింతల ఉమామహేశ్వరి సాయిలు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి వి. రవీందర్ రెడ్డి, ఎ పి ఎమ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News