చౌటుప్పల్ మార్కెట్ యార్డ్లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”
చౌటుప్పల్ మార్కెట్ యార్డ్లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”
K.RAVI
రైతులకు సౌకర్యాలు, పథకాలపై అవగాహన
వ్యవసాయ మార్కెట్ కమిటీ చౌటుప్పల్ ఆధ్వర్యంలో బుధవారం మార్కెట్ యార్డ్లో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మార్కెటింగ్ శాఖ ద్వారా తార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ఆటోమేటిక్ వడ్లు పట్టే యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే మార్కెటింగ్ శాఖ ప్రాముఖ్యత, రైతు బంధు, రైతు భీమా పథకాలపై వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా వాణిజ్య పంటల మార్పిడి, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆదర్శ రైతులను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొగుథాల పావణి రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి, పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ చేనగోని అంజయ్య, ఎ డి ఎ వెంకటేశ్వర్లు, ఎమ్ ఎ ఓ నాగరాజు,ఆర్ ఐ సుధాకర్ రావు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ భాగ్యశ్రీ, కోఆపరేటివ్ సొసైటీ అధికారి సురేష్,ఎ ఈ ఓ శ్రావ్య, మార్కెట్ కమిటీ సభ్యులు డిల్లీ చంద్రకళ, పబ్బు శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు చింతల ఉమామహేశ్వరి సాయిలు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి వి. రవీందర్ రెడ్డి, ఎ పి ఎమ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి