Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:06 PM

చౌటుప్పల్ చెక్‌పోస్టులో పశువుల లారీ పట్టివేత

చౌటుప్పల్ చెక్‌పోస్టులో పశువుల లారీ పట్టివేత

చౌటుప్పల్ చెక్‌పోస్టులో పశువుల లారీ పట్టివేత
May 18, 2026 10:02 PM 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అనుమతులు లేకుండా తరలిస్తున్న 25 పశువులు స్వాధీనం

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా గుర్తించిన పోలీసులు

లారీ సీజ్.. డ్రైవర్‌పై కేసు నమోదు

చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న పశువుల లారీ పట్టుబడింది. లారీలో ఇరుకుగా తరలిస్తున్న 25 పశువులను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్ ఎస్‌హెచ్‌వో జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ఎ. నరేష్, ఏఆర్పీసీ సీతారాం రెడ్డి పెట్రోమొబైల్-01 వాహనంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వచ్చిన సమాచారం మేరకు పంతంగి చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్ వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ లారీ (TS 7UE 3009)ను ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేకుండా 9 ఆవులు, 16 ఎద్దులు కలిపి మొత్తం 25 పశువులను ఇరుకుగా తరలిస్తున్నట్లు గుర్తించారు.లారీ డ్రైవర్ ఎండి షఫీ (50), సరూర్‌నగర్ పరిధిలోని జలపల్లి వాసిగా గుర్తించారు. ఖమ్మం జిల్లా పనితాపురం సంత నుంచి పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. లారీ యజమాని ఎండి పాషా అని డ్రైవర్ వెల్లడించినట్లు తెలిపారు.

పశువులను, లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News