Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:22 AM

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం
April 01, 2026 06:57 PM 201 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అడిషనల్ కోర్టు, శాశ్వత భవనాల కోసం కృషి చేస్తాం: అధ్యక్షుడు తాడూరు పరమేష్

చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల అధికారులు చెన్నూరి రాధా కిషన్ రావు, కానుగుల వెంకటయ్యల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్యం వెంకటాచలం నూతన కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తాడూరు పరమేష్ మాట్లాడుతూ, చౌటుప్పల్ పట్టణంలో మరో అడిషనల్ కోర్టు, సబ్ కోర్టు ఏర్పాటు చేయడంతో పాటు కోర్టులకు అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణం కోసం నూతన పాలకవర్గం కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా అడ్వకేట్ ఫెటర్నిటీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.

నూతన కార్యవర్గం వివరాలు:

ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి,ఉపాధ్యక్షులు పిట్టల బిక్షమయ్య,

సహాయ కార్యదర్శి మక్తాల నరసింహ,

లైబ్రరీ సెక్రటరీ నర్రి స్వామి,

స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీ దేశగోని శ్రీశైలం,మహిళ ప్రతినిధి నకరికంటి జ్యోతి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎండి. ఖయ్యూం పాషా, పిల్లలమర్రి కిరణ్, ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బాల్యం వెంకట చలపతి, ఉడుగు శ్రీనివాస్, ఎలమొని శ్రీనివాస్, ఎన్నికల అధికారులు సిహెచ్ రాధాకృష్ణ రావు, కానుగుల వెంకటయ్య, న్యాయవాదులు రాపోలు వేణు, ముత్యాల సత్తిరెడ్డి, తడక మోహన్, జెల్ల రమేష్, బడుగు శ్రీకాంత్, జక్కర్తి శేఖర్, దాచేపల్లి చంద్రబాబు, బొంగు గోపాల్, రిక్కల సుధాకర్ రెడ్డి, కట్టెల లింగస్వామి, అవ్వారు చేతన్, పాల పరమేష్, చి. జంగయ్య, జె. శ్రీశైలం, భరత్ కుమార్, అయితేగొని శ్రీకాంత్, మల్లికార్జున్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News