Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు
April 01, 2026 08:44 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్నికల అధికారులు అమ్ముడుపోయారని ఫిర్యాదు – బార్ కౌన్సిల్‌కు న్యాయవాదుల విజ్ఞప్తి


చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు న్యాయవాదులు తెలంగాణ బార్ కౌన్సిల్‌ను ఆశ్రయించారు. ఈ నెల 26న జరిగిన ఎన్నికల్లో ఎన్నికల అధికారులు కానుగుల వెంకటయ్య, సిహెచ్ రాధా కిషన్ రావులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వాకిటి నరసింహారెడ్డి, పాల పరమేష్, ఏ. రంగారెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల అధికారులు రెండు బ్యాలెట్ బుక్కులను ముద్రించి, వాటిపై సంతకాలు చేసి, ఒక వర్గానికి అనుకూలంగా సహకరించారని ఆరోపించారు. ఒక న్యాయవాది వద్ద డమ్మీ బ్యాలెట్ పేపర్ లభించడంతో, అందులో స్వస్తిక్ గుర్తు ఉండటం అనుమానాలకు దారితీసిందన్నారు.తాము వెంటనే ఎన్నికల అధికారులకు విషయాన్ని తెలియజేసి, రెండు అధికారుల సంతకాలు ఉండేలా చూడాలని, బయట నుంచి వచ్చే బ్యాలెట్ పేపర్లను అడ్డుకోవాలని సూచించినప్పటికీ వారు పట్టించుకోలేదని వాపోయారు. ఓటింగ్ సమయంలో ఒక ఓటరు సెల్‌ఫోన్‌తో వీడియో కాల్‌లో ఉండటం గమనించి, ఫోన్‌ను అధికారులకు అందించినా, దాన్ని సీజ్ చేయకుండా తిరిగి ఇచ్చినట్టు తెలిపారు.ఓట్ల లెక్కింపులో కూడా స్వస్తిక్ గుర్తులు వేరువేరుగా ఉండటం, ఇంకు తేడాలు కనిపించడం, బ్యాలెట్ పేపర్లు ముడతలు పడటం వంటి అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలపై తాము రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.బ్యాలెట్ పేపర్లు, స్వస్తిక్ గుర్తులు, ఇంకు ప్యాడ్‌లను సీజ్ చేయాలని కోరినా చర్యలు తీసుకోలేదని, దీంతో ఎన్నికల అధికారులు అమ్ముడుపోయినట్టు స్పష్టమవుతోందని వారు అన్నారు.ఈ నేపథ్యంలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికలను రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, సంబంధిత ఎన్నికల అధికారులపై విచారణ జరిపి బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని తెలంగాణ బార్ కౌన్సిల్‌ను న్యాయవాదులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News