వలిగొండ స్థానికం ప్రతినిధి:
వలిగొండ పరిధిలోని వెల్వర్తి గ్రామంలోని చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వెల్వర్తి గ్రామంలో నెలకొల్పనున్న చత్రపతి శివాజీ విగ్రహానికి 50వేల రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వెల్వర్తి శివాజీ యువజన సంఘం సభ్యులు ఎలిమినేటి జంగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన సంఘం మండల అధ్యక్షుడు పల్సం రాజు గౌడ్, చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల కొండల రెడ్డి, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి