Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:24 PM

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ
February 13, 2026 07:29 PM 195 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ మండల కేంద్రంలో ట్రాక్టర్ యజమానులు మరియు డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అతివేగం మరియు అజాగ్రత్త గ్రామీణ రహదారులపై ట్రాక్టర్లను అతివేగంతో నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, డ్రైవర్లు నిలకడగా, జాగ్రత్తగా వాహనాలను నడపాలని ఎస్సై సూచించారు.

ప్రతి ట్రాక్టర్‌కు తప్పనిసరిగా ఆర్.సి , ఇన్సూరెన్స్ మరియు డ్రైవర్లకు లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. రికార్డులు సరిగా లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వయస్సు నిండని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని యజమానులకు తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే, యజమానులనే బాధ్యులను చేస్తూ కఠిన కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

ట్రాక్టర్ ట్రాలీలలో పరిమితికి మించి లోడ్ వేయకూడదని, ముఖ్యంగా వ్యవసాయ పనుల సమయంలో రాత్రి వేళల్లో వెనుక వైపు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు ప్రమాద రహిత మండలంగా చాట్రాయి మండలాన్ని మార్చడానికి సహకరించాలని ఎస్సై రామకృష్ణ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News