Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:45 AM

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ
February 13, 2026 07:29 PM 205 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ మండల కేంద్రంలో ట్రాక్టర్ యజమానులు మరియు డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అతివేగం మరియు అజాగ్రత్త గ్రామీణ రహదారులపై ట్రాక్టర్లను అతివేగంతో నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, డ్రైవర్లు నిలకడగా, జాగ్రత్తగా వాహనాలను నడపాలని ఎస్సై సూచించారు.

ప్రతి ట్రాక్టర్‌కు తప్పనిసరిగా ఆర్.సి , ఇన్సూరెన్స్ మరియు డ్రైవర్లకు లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. రికార్డులు సరిగా లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వయస్సు నిండని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని యజమానులకు తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే, యజమానులనే బాధ్యులను చేస్తూ కఠిన కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

ట్రాక్టర్ ట్రాలీలలో పరిమితికి మించి లోడ్ వేయకూడదని, ముఖ్యంగా వ్యవసాయ పనుల సమయంలో రాత్రి వేళల్లో వెనుక వైపు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు ప్రమాద రహిత మండలంగా చాట్రాయి మండలాన్ని మార్చడానికి సహకరించాలని ఎస్సై రామకృష్ణ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News