Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:38 AM

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ
13-02-2026 208 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ మండల కేంద్రంలో ట్రాక్టర్ యజమానులు మరియు డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అతివేగం మరియు అజాగ్రత్త గ్రామీణ రహదారులపై ట్రాక్టర్లను అతివేగంతో నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, డ్రైవర్లు నిలకడగా, జాగ్రత్తగా వాహనాలను నడపాలని ఎస్సై సూచించారు.

ప్రతి ట్రాక్టర్‌కు తప్పనిసరిగా ఆర్.సి , ఇన్సూరెన్స్ మరియు డ్రైవర్లకు లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. రికార్డులు సరిగా లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వయస్సు నిండని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని యజమానులకు తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే, యజమానులనే బాధ్యులను చేస్తూ కఠిన కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

ట్రాక్టర్ ట్రాలీలలో పరిమితికి మించి లోడ్ వేయకూడదని, ముఖ్యంగా వ్యవసాయ పనుల సమయంలో రాత్రి వేళల్లో వెనుక వైపు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు ప్రమాద రహిత మండలంగా చాట్రాయి మండలాన్ని మార్చడానికి సహకరించాలని ఎస్సై రామకృష్ణ కోరారు.

Sthanikam

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ

Article Image

రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ మండల కేంద్రంలో ట్రాక్టర్ యజమానులు మరియు డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అతివేగం మరియు అజాగ్రత్త గ్రామీణ రహదారులపై ట్రాక్టర్లను అతివేగంతో నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, డ్రైవర్లు నిలకడగా, జాగ్రత్తగా వాహనాలను నడపాలని ఎస్సై సూచించారు.

ప్రతి ట్రాక్టర్‌కు తప్పనిసరిగా ఆర్.సి , ఇన్సూరెన్స్ మరియు డ్రైవర్లకు లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. రికార్డులు సరిగా లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వయస్సు నిండని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని యజమానులకు తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే, యజమానులనే బాధ్యులను చేస్తూ కఠిన కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

ట్రాక్టర్ ట్రాలీలలో పరిమితికి మించి లోడ్ వేయకూడదని, ముఖ్యంగా వ్యవసాయ పనుల సమయంలో రాత్రి వేళల్లో వెనుక వైపు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు ప్రమాద రహిత మండలంగా చాట్రాయి మండలాన్ని మార్చడానికి సహకరించాలని ఎస్సై రామకృష్ణ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News