చాట్రాయిలో మట్టి నమూనా విధానాన్ని సేకరించు పద్ధతులను తెలియజేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్
చాట్రాయిలో మట్టి నమూనా విధానాన్ని సేకరించు పద్ధతులను తెలియజేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని స్ధానిక రైతు సేవ కేంద్రం వద్ద పకృతి వ్యవసాయ సిబ్బందికి మరియు గ్రామస్థాయి వ్యవసాయ అధికారులకు మట్టి నమూనా సేకరించు విధానాన్ని , క్షేత్రస్థాయిలో సేకరించు పద్ధతులను మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ తెలియజేశారు. సందర్భంగా మాట్లాడుతూ మట్టి నమూనా ప్రత్యేకించి ప్రకృతి వ్యవసాయం చేయు రైతుల భూమిలో సేకరించాలని. భూమిలో ఉన్న సేంద్రీయ కర్బన శాతం, నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు విలువలు తెలుసుకోవడానికి మట్టి నమూనా పరీక్షలు చాలా ఉపయోగపడతాయని, రైతులు పరీక్ష ఫలితం ద్వారా (భూసార పరీక్ష కేంద్రాల) ఎరువులు తగు పాళ్ళలో వాడడం ద్వారా ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చని, భూమిలో సేంద్రీయ కర్బన పదార్థాలు అనగా ఆర్గానిక్ శాతం పశువుల ఎరువులు ఉన్నప్పుడే సూక్ష్మజీవులు సంఖ్య పెరిగి రైతులకు నాణ్యమైన దిగుబడులు వస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి