చాట్రాయిలో ‘మన్ కీ బాత్’ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
చాట్రాయిలో ‘మన్ కీ బాత్’ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయిలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను స్థానిక నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రధాని ప్రతి నెల చివరి ఆదివారం రేడియో, టెలివిజన్ ద్వారా దేశ ప్రజలతో నేరుగా సంభాషిస్తున్నారని తెలిపారు.
2014 అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానానికి వేదికగా నిలిచిందని చెప్పారు. స్వచ్ఛ భారత్, పర్యావరణ పరిరక్షణ, విద్య, మహిళా సాధికారత, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించడం దీని ముఖ్య లక్ష్యమన్నారు. సమాజంలో మంచి పనులు చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహిస్తూ, విద్యార్థులు, రైతులు, యువతకు ప్రేరణాత్మక సందేశాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులకు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలను సందర్శించే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో జవహర్లల్ నెహ్రు యూనివర్సిటీ , యూనివర్సిటీ అఫ్ ఢిల్లీ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఢిల్లీ , అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ , న్యూ ఢిల్లీ , పార్లమెంట్ భవనం వంటి ప్రదేశాలను సందర్శించాలన్నారు. అలాగే బి .ఆర్ . అంబేద్కర్ఆ లోచనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, “మనిషి స్థాయిని మార్చేది చదువే” అన్న ఆయన సందేశాన్ని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గడ్డం సంజీవరెడ్డి, కనుమత రెడ్డి ముత్తారెడ్డి, బాలస్వామి, పోతిరెడ్డిపల్లి చెన్నారావు, ఎస్సీ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తగడం రాజు, కూరపాటి బాబ్జి, ఓబీసీ మోర్చా నాయకుడు ఆదిమూలం మోహన్ శర్మ, ఇజ్జగిరి కేశవ నర్సింహారావు, జనసేన నాయకుడు సవరం రామారావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి