Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

చాట్రాయిలో ‘మన్ కీ బాత్’ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

చాట్రాయిలో ‘మన్ కీ బాత్’ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

చాట్రాయిలో ‘మన్ కీ బాత్’ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
February 20, 2026 11:06 AM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయిలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను స్థానిక నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రధాని ప్రతి నెల చివరి ఆదివారం రేడియో, టెలివిజన్‌ ద్వారా దేశ ప్రజలతో నేరుగా సంభాషిస్తున్నారని తెలిపారు.

2014 అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానానికి వేదికగా నిలిచిందని చెప్పారు. స్వచ్ఛ భారత్‌, పర్యావరణ పరిరక్షణ, విద్య, మహిళా సాధికారత, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించడం దీని ముఖ్య లక్ష్యమన్నారు. సమాజంలో మంచి పనులు చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహిస్తూ, విద్యార్థులు, రైతులు, యువతకు ప్రేరణాత్మక సందేశాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.

విద్యార్థులకు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలను సందర్శించే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో జవహర్లల్ నెహ్రు యూనివర్సిటీ , యూనివర్సిటీ అఫ్ ఢిల్లీ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఢిల్లీ , అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ , న్యూ ఢిల్లీ , పార్లమెంట్ భవనం వంటి ప్రదేశాలను సందర్శించాలన్నారు. అలాగే బి .ఆర్ . అంబేద్కర్ఆ లోచనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, “మనిషి స్థాయిని మార్చేది చదువే” అన్న ఆయన సందేశాన్ని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గడ్డం సంజీవరెడ్డి, కనుమత రెడ్డి ముత్తారెడ్డి, బాలస్వామి, పోతిరెడ్డిపల్లి చెన్నారావు, ఎస్సీ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తగడం రాజు, కూరపాటి బాబ్జి, ఓబీసీ మోర్చా నాయకుడు ఆదిమూలం మోహన్ శర్మ, ఇజ్జగిరి కేశవ నర్సింహారావు, జనసేన నాయకుడు సవరం రామారావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News