చాట్రాయిలో మహిళా శక్తి జోష్… ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
చాట్రాయిలో మహిళా శక్తి జోష్… ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి,: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చాట్రాయి మండలంలో మహిళా శక్తి ఉత్సాహం మధ్య బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనపల సురేష్ ఆదేశాల మేరకు చనుబండ గ్రామానికి చెందిన ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
నూజివీడు పురపాలక సంఘ కార్యాలయం మహిళల సందడితో కళకళలాడింది. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, మెమెంటోలు అందజేసి సన్మానించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ మహిళలు ఇక వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు. పారిశుద్ధ్య మహిళా సిబ్బంది సేవలను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి కృషి లేకుండా గ్రామాల్లో పరిశుభ్రత సాధ్యం కాదని అన్నారు.
శరణాల మాలతీరాణి మాట్లాడుతూ మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని, మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానులని, పిల్లలకు మొదటి గురువు తల్లేనని పేర్కొన్నారు. సమాజంలో మార్పు రావాలంటే మహిళలే ముందుండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ కమిషనర్ కె.పేరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నగడపాటి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షురాలు మల్లిపూడి నాగరాణి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఇలపర్తి కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మొత్తం మీద ఈ వేడుకలు మహిళా శక్తి, ఐక్యతను ప్రతిబింబిస్తూ ప్రత్యేకంగా నిలిచాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి